
గురుకులంలో సిల్వర్ జూబ్లీ వేడుకలు
సారంగపూర్:మండలంలోని జామ్ గ్రామంలోని సాంఘిక సంక్షేమశాఖ బాలికల గురుకుల విద్యాలయం ఏర్పాటు చేసి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 25 ఏళ్లలో గురుకులంలో చదువుకున్న అందుబాటులో ఉన్న విద్యార్థులందరికీ పాఠశాల సిబ్బంది ఆహ్వాన పత్రాలు పంపించారు. పూర్వ విద్యార్థులు తమ అనుభవాలను, పాఠశాలతో తమకున్న అనుబంధాలను పంచుకున్నారు. అనంతరం అప్పట్లో తమకు చదువు నేర్పిన గురువులను సత్కరించారు. అప్పటి ప్రిన్సిపాల్ చలపతి, ప్రస్తుత ప్రిన్సిపాల్ సంగీత, గతంలో ఇక్కడ పనిచేసిన ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.