
కొనుగోలు కేంద్రం పరిశీలన
సోన్: మండలంలోని పాక్పట్ల గ్రామంలోగల ధా న్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని కూడా పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని కోరారు. కొనుగోలు ప్రక్రియలో జాప్యంపై ఆరా తీశారు. తప్ప, తేమ శా తం పేరుతో రైతులను మోసగిస్తే సహించే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. రైతులను దోపిడీ చేసే రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, నాయకులు రావుల రాంనాథ్, సరికెల గంగన్న, మార గంగారెడ్డి, రమేశ్రెడ్డి, జక్క రాజేశ్వర్, నర్సారెడ్డి, ముత్యం, నర్సయ్య, గంగారెడ్డి, భీ ముడు, పోశెట్టి, రైతులున్నారు.