ఉపాధ్యాయుల్లో ‘సర్దుబాటు’ రగడ | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుల్లో ‘సర్దుబాటు’ రగడ

Jun 2 2025 12:27 AM | Updated on Jun 2 2025 12:27 AM

ఉపాధ్

ఉపాధ్యాయుల్లో ‘సర్దుబాటు’ రగడ

నిర్మల్‌ రూరల్‌: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది. ఇందుకోసం ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. అయితే ఈ ప్రక్రియ ఈనెల 13లోపు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. విద్యాశాఖ ఇచ్చిన ఉత్తర్వులపై ఉపాధ్యాయ సంఘాల నుంచి తీవ్ర వ్య తిరేకత వస్తోంది. జిల్లా విద్యాశాఖ అధికారులు జిల్లాలో ప్రస్తుతం ఒక్కో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య.. ఎంత మంది ఉపాధ్యాయులున్నారు.. ఇంకా ఎంతమంది అవసరం ఉంది.. తదిత వివరాలు సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు.

ఇవీ నిబంధనలు

ఈనెల 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియలో భాగంగా తాజాగా ప్రభుత్వం నిబంధనలు జారీ చేసింది. మొదటి ప్రాధాన్యం పంచా యతీ పరిధి, తర్వాత స్కూల్‌ కాంప్లెక్స్‌, ఆ తర్వా త మండలం, అనంతరం జిల్లా పరిధిలో సర్దుబా టు చేసుకోవచ్చు. వీటితోపాటు ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా సర్దుబా టు చేయాలని నిబంధనలున్నాయి. పరస్పర బ దిలీలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వరాదు. ఒకే ప్రాంగణంలో రెండు ప్రాథమిక పాఠశాలలు లేదా ఒక ఉన్నత, ప్రాథమిక పాఠశాల, ఒక ప్రాథమిక పాఠశాల ఒకే ప్రాంగణంలో ఉంటే వాటిని ఒక యూనిట్‌గా పరిగణించవ చ్చు. అవసరాన్ని బట్టి ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలి. ఇంకా మిగులు ఉంటే ఇతర అ వసరమైన స్కూళ్లకు పంపించాలి. ఈ ప్రక్రియ కోసం గత యూడైస్‌ వివరాలను ప్రాతిపదికగా తీసుకోనున్నారు. 10 మందిలోపు విద్యార్థులున్న పాఠశాలకు ఒకరు, 60లోపు ఉన్న పాఠశాలకు ఇద్దరు, 90 లోపు ఉన్న పాఠశాలకు ముగ్గురు, 200లోపు విద్యార్థులుంటే ఆరుగురు ఉపాధ్యాయులు ఉండాలని, 200 దాటిన తర్వాత ప్రతీ నలభై మందికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయ సంఘాలు

సర్దుబాటు ప్రక్రియను ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నెల 6వ తేదీ నుంచి బడిబాట కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. కాగా, బడిబాట ముగిసిన తర్వాత విద్యార్థుల సంఖ్యపై స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందని, ఆ తర్వాత సర్దుబాటు ప్రక్రియ చేపట్టాలని ఉపాధ్యాయ వర్గాలు కోరుతున్నాయి. విద్యాశాఖ ముందస్తు సర్దుబాటు నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తంజేస్తున్నాయి. విద్యాశాఖ ఉత్తర్వుల ప్రకా రం 60మంది విద్యార్థులుంటే ఇద్దరు ఉపాధ్యాయులు సరిపోతారని ఉండగా ఇది ఆచరణలో అ సాధ్యమని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఒక టి నుంచి ఐదో తరగతి వరకు మొత్తం 18 సబ్జెక్టులుంటే ఇద్దరే ఉపాధ్యాయులు ఎలా బోధిస్తారని ప్రశ్నిస్తున్నారు. బోధనతోపాటు అనేక రకాల రి పోర్టులు, నివేదికలు సిద్ధం చేయాల్సి ఉంటుంద ని, వాటికే ఒకరు సరిపోతున్నారని వాపోతున్నా రు. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా తరగతికి ఒక ఉపాధ్యాయుడి చొప్పున కేటాయించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

బడిబాట తర్వాతే చేపట్టాలి

బడిబాట కార్యక్రమం ముగిసిన తర్వాత ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలి. దీంతో పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందా... అదే విధంగా ఉంటుందా.. అనేది తెలుస్తుంది. దీన్ని ఆధారంగా చేసుకుని సర్దుబాటు ప్రక్రియ చేపడితే బాగుంటుంది. – భూమన్నయాదవ్‌,

ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు

పాఠశాలల వారీగా వివరాల సేకరణ

13లోపు ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు

వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయ సంఘాలు

ఉపాధ్యాయుల్లో ‘సర్దుబాటు’ రగడ1
1/1

ఉపాధ్యాయుల్లో ‘సర్దుబాటు’ రగడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement