
అ‘పూర్వ’ం.. ఆత్మీయ సమ్మేళనం
కడెం: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్న త పాఠశాలలో 1992–93 విద్యాసంవత్సరంలో పదోతరగతి చదివినవారంతా ఆదివారం మండలంలోని కొండుకూర్లోగల ఫంక్షన్హాల్లో పూ ర్వవిద్యార్థుల సమ్మేళనం పేరిట కలుసుకున్నా రు. ఆప్యాయంగా పలకరించుకుని ఒకరి యోగక్షేమాలు ఒకరు తెలుసుకున్నారు. పాఠశాలలో చ దివిన జ్ఞాపకాలు గుర్తు చేసుకుని సరదాగా గడిపారు. అప్పటి ఉపాధ్యాయులను ఆహ్వానించి సన్మానించారు. వారికి జ్ఞాపికలు అందజేశారు.
దస్తురాబాద్ మండల కేంద్రంలో..
దస్తురాబాద్: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉ న్నత పాఠశాలలో 1996–1997 విద్యాసంవత్సరంలో పదోతరగతి చదివినవారంతా దస్తురా బాద్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పా ఠశాలలో చదివిన జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నా రు. విద్యాబుద్ధులు నేర్పిన అప్పటి ఉపాధ్యాయులను శాలువాలతో సన్మానించారు.

అ‘పూర్వ’ం.. ఆత్మీయ సమ్మేళనం