అ‘పూర్వ’ం.. అద్వితీయం | - | Sakshi
Sakshi News home page

అ‘పూర్వ’ం.. అద్వితీయం

May 26 2025 9:50 AM | Updated on May 26 2025 9:50 AM

అ‘పూర్వ’ం.. అద్వితీయం

అ‘పూర్వ’ం.. అద్వితీయం

లక్ష్మణచాంద: మండలంలోని వడ్యాల్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2009–10లో పదోతరగతి చదివినవారంతా ఆదివారం మండలంలోని కనకాపూర్‌ కేఎన్‌ఆర్‌ గార్డెన్స్‌లో పూర్వవిద్యార్థుల స మ్మేళనం పేరిట కలుసుకున్నారు. వివిధ ప్రాంతా ల్లో ఉంటున్నవారంతా ఒక్కచోట చేరి ఒకరినొక రు ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఒకరి యో గక్షేమాలు ఒకరు తెలుసుకున్నారు. అప్పటి ఉపాధ్యాయులు రవికుమార్‌, మోహన్‌రావు, నారా యణ, వకుల కుమారి, లక్ష్మణ్‌ను ఆహ్వానించి స న్మానించారు. పూర్వవిద్యార్థులు అశోక్‌, రాజు, సతీశ్‌ తదితరులు పాల్గొన్నారు.

పొన్కల్‌ జిల్లా పరిషత్‌ పాఠశాలలో..

మామడ: మండలంలోని పొన్కల్‌ జిల్లా పరిషత్‌ సెకండరీ పాఠశాలలో 2010–11లో పదోతరగతి చదివినవారంతా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అంతా ఒక్కచోట చేరి ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. పాఠశాలలో చది విన జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుని ఆనందంగా గడిపారు. పూర్వవిద్యార్థులు స్రవంతి, స్వప్న, కృష్ణవేణి, మౌనిక, అనిత, కళ్యాణి, నాగరాజు, అనిల్‌, ముత్యం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement