
ధాన్యం తూకంలో తేడావస్తే చర్యలు
● ఇన్చార్జి డీసీఎస్వో కోమల్రెడ్డి
దస్తురాబాద్:వరి ధాన్యం తూకంలో తేడాలు వస్తే కొనుగోలు కేంద్రాల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని ఇన్చార్జి డీసీఎస్వో కోమల్రెడ్డి హెచ్చరించారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో వ్యవసాయ అధికారులు, ఐకేపీ సిబ్బంది, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో గురువా రం సమీక్ష నిర్వహించారు. ప్రతీ కొనుగోలు కేంద్రంలో బస్తాకు 41.5 కిలోల ధాన్యం మాత్రమే తూకం వేయాలన్నారు. మూడు రోజుల క్రితం రైతులను రైస్మిల్ యజమానులు వేధిస్తున్నారని వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొన్నారు. రైతులను అయోమయానికి గురిచేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతీ కొనుగోలు కేంద్రంలో తాగునీరు, గన్నీ సంచులు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. సమీక్షలో తహసీల్దార్ సర్పరాజ్ నవాజ్, డీటీ యాదవరావ్, ఏపీఎం గంగన్న, ఏఈవో తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
జొన్న కొనుగోళ్లు పరిశీలన..
కుంటాల: ప్రభుత్వం దళారీ వ్యవస్థ నిర్మూలించేందుకు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఇన్చార్జి డీసీఎస్ వో సూచించారు. కుంటాలలోని జొన్న కొనుగోలు కేంద్రాన్ని గురువారం పరిశీలించారు. త్వరితగతిన కొనుగోళ్లు చేపట్టాలని ఆదేశించారు. అంతకుముందు కుంటాల శివారు ప్రాంతంలోని దౌనెల్లి మార్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కోసం స్థలాన్ని పరిశీలించారు. ఆయన వెంట డీటీ నరేశ్గౌడ్,ీ పఏసీఎస్ చైర్మన్ సట్ల గజ్జారాం, ఆర్ఐలు అడెల్లు, రాజేశ్వర్, డైరెక్టర్ ప్రణయ్రావు, సిబ్బంది మహేశ్, కృష్ణ, రైతులు పాల్గొన్నారు.