
శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలి
దస్తురాబాద్: శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు నిరంతరం కృషి చేయాలని ఏఎస్పీ రాజేశ్ మీనా సూచించారు. బుధవారం రాత్రి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించిన ఏఎస్సై లక్ష్మీనారాయణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలన్నారు. ముఖ్యంగా డయల్ 100 కాల్స్పై వెంటనే స్పందించి సంఘటన స్థలానికి చేరుకుని వాస్తవ పరిస్థితులను అంచనావేసి తగుచర్యలు చేపట్టాలన్నారు. అనంతరం ఏఎస్సై లక్ష్మీనారాయణ సేవలను కొనియాడి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీఐ అజయ్, కడెం ఎస్సై కృష్ణ సాగర్రెడ్డి, ట్రెయినీ ఎస్సై తిరుపతిరెడ్డి, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.