
పరీక్షా కేంద్రాల సందర్శన
తానూరు: మండలంలోని ఎల్వి, భోసి, తానూరులోని పదో తరగతి పరీక్షా కేంద్రాలను బుధవారం డీఈవో పీ రామారావ్ సందర్శించారు. తానూరులో పదో తరగతి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఎంఈవో నరేందర్, సీఎస్లు శంకర్, రాజశేఖర్, మల్లన్న, సిబ్బంది లింబాద్రి తదితరులున్నారు.
రేషన్ దుకాణం తనిఖీ
సోన్: మండలంలోని న్యూ బొప్పారం గ్రామంలోని రేషన్షాపును బుధవారం అడిషనల్ కలెక్టర్ కిశోర్కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సన్న బియ్యం పంపిణీని పరిశీలించారు. మంగళవారం ఇదే షాపులో తహసీల్దార్ మల్లేశ్రెడ్డి సన్నబియ్యం పంపిణీని ప్రారంభించడం గమనార్హం. ఆయన వెంట ఆర్ఐ అలీమున్నీసా, డీలర్ హన్మంతు తదితరులున్నారు.

పరీక్షా కేంద్రాల సందర్శన