కరోనా బారినపడ్డ రాజస్తాన్ మంత్రి
జైపూర్ : కరోనా బారిన పడుతున్న ప్రజాప్రతినిధుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. తాజాగా రాజస్తాన్లో రవాణాశాఖ మంత్రి ప్రతాప్ సింగ్ ఖాచారియావాస్కు కరోనా పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. దీంతో వెంటనే ఆయన స్వీయ నిర్భందంలోకి వెళ్లారు. గత కొన్ని రోజులుగా కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకున్నాని, ఈ సందర్భంగా కరోనా వచ్చినట్లు తేలిందని మంత్రి ప్రతాప్ సింగ్ స్వయంగా ట్వీట్ చేశారు. గతకొన్ని రోజులుగా తనను కలిసిన వారందరూ లక్షణాలు ఉంటే కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన పేర్కొన్నారు. కాగా మంత్రి ప్రతాప్సింగ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ట్వీట్ చేశారు. ఆయన ఆరోగ్యం త్వరగా మెరుగవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. (మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి కరోనా పాజిటివ్)
Wishing my ministerial colleague, Pratap Singh Khachariyawas ji speedy recovery from #COVID19. May he get well soon. @PSKhachariyawas
— Ashok Gehlot (@ashokgehlot51) August 30, 2020