Rajasthan: ఆయిల్​ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం.. నలుగురు మృతి

Rajasthan: Fire Accident In Turpentine Oil Factory In Jamwa Ramgarh Jaipur - Sakshi

జైపూర్​: రాజస్తాన్‌​లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అధికారుల ప్రకారం..  జైపూర్​లోని జామ్వా రామ్​గఢ్​ ప్రాంతంలో ఉన్న టర్పెంటైన్​ ఆయిల్​ ఫ్యాక్టరీలో ఆదివారం మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మృతి చెందిన వారిలో ముగ్గురు పిల్లలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. స్థానికులు వెంటనే ఫైర్​ సిబ్బందికి సమాచారం అందించారు.

అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికులతో కలిసి సహయక చర్యలను ముమ్మరం చేశారు. ఫైర్​ సిబ్బంది మంటలను అదుపులోనికి తెస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. క్షత గాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం మంటలు అదుపులోనికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. 

చదవండి: గత 2 నెలలుగా బాలికను వినోద్​జైన్ లైంగికంగా​ వేధించాడు: ఏసీపీ

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top