పంజాబ్‌: కొత్త లాక్‌డౌన్‌ నిబంధనలు | Punjab: Amarinder Singh's New Lockdown Rules | Sakshi
Sakshi News home page

పంజాబ్‌: కొత్త లాక్‌డౌన్‌ నిబంధనలు

Aug 20 2020 8:49 PM | Updated on Aug 20 2020 9:10 PM

Punjab: Amarinder Singh's New Lockdown Rules - Sakshi

కరోనా మహమ్మరి  కట్టడికి పంజాబ్‌ ప్రభుత్వం మరోసారి కఠిన చర్యలు  తీసుకుంది.

ఛండీఘర్‌: కరోనా మహమ్మరి  కట్టడికి పంజాబ్‌ ప్రభుత్వం మరోసారి కఠిన చర్యలు  తీసుకుంది. రాత్రి 7 గంటల నుంచి తెల్లవారు జామున 5 గంటల వరకు కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది. దీనిని ఉల్లఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది. కేవలం పెళ్లిలకు, అంత్యక్రియలకు మాత్రమే ఎక్కువ మంది జనం పాల్గొనన్నడానికి అనుమతినిచ్చింది. ఆగస్టు 31 వరకు ఈ నిబంధనలు వర్తించనున్నాయి. 

ఈలోపు రాజకీయపార్టీలకు కూడా ర్యాలీలు, పార్టీ మీటింగ్‌లు నిర్వహించడానికి అనుమతినివ్వద్దని ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేట్‌, ప్రభుత్వ సంస్థలు కూడా ఉద్యోగుల సంఖ్యను సగానికి తగ్గించాలని కోరారు. రవాణా వాహనాలు కూడా ప్రయాణీకుల పరిమితిని 50 శాతానికి తగ్గించుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో 36000 కరోనా కేసులు నమోదు కాగా, ఈ మహమ్మారి బారిన పడి 900 మంది ప్రాణాలు కోల్పోయారు. వారందరి మృతి పట్ల సీఎం విచారణ వ్యక్తం చేశారు. గురువారం నుంచి కర్ఫ్యూ అమలులోకి వస్తుందని సీఎం తెలిపారు.  

చదవండి: ఎన్నికలకు ముందు బిహార్‌ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement