ఆదివాసీ చెంచుల అభ్యున్నతే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ఆదివాసీ చెంచుల అభ్యున్నతే లక్ష్యం

Jul 8 2025 7:05 AM | Updated on Jul 8 2025 7:05 AM

ఆదివాసీ చెంచుల అభ్యున్నతే లక్ష్యం

ఆదివాసీ చెంచుల అభ్యున్నతే లక్ష్యం

మన్ననూర్‌: ఆదివాసీ చెంచుల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం అమ్రాబాద్‌ మండలం మన్ననూర్‌లోని గిరిజన భవన్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ, రాజేశ్‌రెడ్డితో కలిసి ఆయన ఆదివాసీ చెంచులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. నాడు, నేడు ఆదివాసీ చెంచులను అక్కున్న చేరుకున్నది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని అన్నారు. కాంగ్రెస్‌ హయాంలోనే ఎంతో మందికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి సొంతింటి కలను సాకారం చేశామని.. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇచ్చే బాధ్యత తీసుకుంటుందని అన్నారు. మన్ననూర్‌ ఐటీడీఏ పరిధిలో ఉన్న 5 జిల్లాల్లోని చెంచులతో పాటు రాష్ట్రంలోని ఐటీడీఏల పరిధిలో విడతల వారీగా 13,266 చెంచు కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఇంటి నిర్మాణ బిల్లులు రూ. 5లక్షలతో పాటు అదనంగా మరో రూ.లక్ష అందిస్తామన్నారు.

ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇచ్చే బాధ్యత మాదే

రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణశాఖ

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement