
నీరు కలుషితమయ్యే ప్రమాదం
వర్షాకాలంలో అధికంగా కలుషిత నీరు తాగడం వల్లే రోగాల బారిన పడతారు. ఇలాంటి అంటువ్యాధులను దృష్టిలో ఉంచుకొని మంచినీటి ట్యాంకుల్లో బ్లీచింగ్ పౌడర్ వేయాలి. అలాగే ఇళ్లకు సరఫరా అయ్యే భగీరథ, స్థానిక నీటి వనరుల బోర్ల వద్ద నీటిని సేకరించి పరీక్ష చేయాలి. అవి తాగడానికి ఉపయోగపడతాయి అంటే సరఫరా చేయాలి. లేదంటే అంటువ్యాధుల బారిన పడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.
– ఆంజనేయులు, మాజీ సర్పంచ్, పల్లెగడ్డ
నీటి పరీక్షలు చేస్తున్నాం
వర్షాకాలం నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మిషన్ భగీరథకు సంబందించిన వాటర్ గ్రిడ్ల దగ్గర నిత్యం పరీక్షలు చేసిన తర్వాతనే గ్రామాలకు, పట్టణాలకు నీటి సరఫరా చేస్తున్నాం. లీకేజీలను పూర్తిగా ఆరికట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ, ఎక్కడో ఒక చోట పైపులైన్ లీకేజీలు అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిని గుర్తించి మరమ్మతు చేసి కలుషిత నీరు సరఫరా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తమ సిబ్బందిని ఆదేశించాం. – సరిత, ఆర్డబ్ల్యూఎస్ డీఈ
●