ఇక క్షేత్రస్థాయి పరిశీలన | - | Sakshi
Sakshi News home page

ఇక క్షేత్రస్థాయి పరిశీలన

Jun 24 2025 4:03 AM | Updated on Jun 24 2025 4:03 AM

ఇక క్

ఇక క్షేత్రస్థాయి పరిశీలన

నారాయణపేట: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన భూభారతి రెవెన్యూ చట్టం – 2025 రెవెన్యూ గ్రామసభలు గత శుక్రవారంతో ముగిశాయి. రైతులు ఇక తమ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదంటూ..ఊరు దాటక్కర్లేదు.. కాలు కదపక్కర్లేదు.. రెవెన్యూ అధికారులే మీ గడప వద్దకు వస్తారనే నినాదంతో ప్రభుత్వం చేపట్టిన భూ భారతి కార్యక్రమం గ్రామస్తుల్లోని రైతుల్లో విశ్వాసం నింపింది. జిల్లాలోని 12 మండలాల్లో 234 రెవెన్యూ గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో 4,052 మంది రైతుల నుంచి తమ భూ సమస్యలు పరిష్కరించాలంటూ రెవెన్యూ అధికారులకు దరఖాస్తులు అందించారు. ఇందులో అత్యధికంగా నారాయణపేట మండలంలో 1230 దరఖాస్తులు రాగా..అత్యల్పంగా నర్వ మండలంలో 107 మంది వచ్చాయి. కోర్టు పరిధిలో ఉన్న వివాదాలు, వాజ్యాలు మినహా భూ భారతి సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను ఆగస్టు 15లోగా పరిష్కరిస్తామని ప్రభుత్వం పేర్కొంది.

జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు

ధరణి వ్యవస్థలో తలెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు, రైతుల వద్దకే సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని రూపొందించి రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి తీసుకొచ్చింది. జూన్‌ 2 నుంచి నిర్వహించిన రెవెన్యూ సదస్సులు నాలుగు రోజుల క్రితం ముగిశాయి. సర్వేయర్లు, రెవెన్యూ ఇన్‌న్‌స్పెక్టర్లు, అధికారులు గ్రామాల్లో రెవె న్యూ సదస్సులు ఏర్పాటు చేసి రైతుల నుంచి వారి భూ సమస్యలకు సంబంధించిన వివరాలను సేకరించారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు గ్రామా పంచాయతీ కార్యాలయాల్లో భూ భారతితో సంబంధిత అవగాహన సదస్సులు, దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమా లు చేపట్టారు. ఈ పథకం మొదట్లో పైలెట్‌ ప్రాజెక్టుగా జిల్లాలోని మద్దూర్‌ మండలాన్ని ఎంపిక చేశా రు. అక్కడ విజయవంతం కావడంతో రాష్ట్ర వ్యా ప్తంగా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కొత్త చట్టం ప్ర కారం, రైతులు వారి భూమి సమస్యలపై సంబంధి త ఫారాల ద్వారా అధికారులకు సమాచారం అందించారు. తర్వాతి దశలో చేపట్టిన రెవెన్యూ సదస్సులో ప్రధానంగా మిస్సింగ్‌సర్వే నంబర్లు సరిచేసేందుకు 1284మంది రైతులు, భూముల ఎక్స్‌టెంట్‌ను సరిచేసేందుకు 776మంది, పేర్లు సరిచేయాల ని 335 మంది దర ఖాస్తు చేసుకున్నారు.

234 ప్రత్యేక బృందాలు..

జిల్లాలో నిర్వహించిన సదస్సుల్లో రెవెన్యూ అధికారుల బృందాలు స్వీకరించిన 4,052 దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. 234 రెవెన్యూ గ్రామాల్లో అధికారుల బృందాలు వారికి కేటాయించిన గ్రామాల్లో మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ముందడుగు వేశారు. భవిష్యత్తులో భూ వివాదం, ఘర్షణలు జరగొద్దనే ఉద్దేశ్యంతోనే పకడ్బందీగా పరిశీలన చేయనున్నట్లు రెవెన్యూ అధికారుల బృందాలు చెబుతున్నారు. ఇదిలాఉండగా, జిల్లాలోని అన్ని మండలాల్లోని సర్వేయర్లకు ఇప్పటికే ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న ఆగస్టు 15 నాటికి అందరూ భూమి సంబంధిత సమస్యల నుంచి విముక్తి పొందేలా ఉచితంగా పరిష్కారాలు అందించనున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. సర్వేయర్లు అవసరమైన సర్వేలు నిర్వహించి, భూమి గీతలు ఖచ్చితంగా గుర్తించి, సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టనున్నారు.

‘భూ భారతి’కి సమస్యల వెల్లువ

రెవెన్యూ సదస్సులో 4,052 దరఖాస్తులు

అత్యధికంగా ‘పేట’లో 1230.. అత్యల్పంగా నర్వలో 107 దరఖాస్తులు

మిస్సింగ్‌ సర్వే నంబర్లు, ఎక్స్‌టెంట్‌,పేర్ల సవరణవే అధికం

ఇక క్షేత్రస్థాయి పరిశీలన 1
1/2

ఇక క్షేత్రస్థాయి పరిశీలన

ఇక క్షేత్రస్థాయి పరిశీలన 2
2/2

ఇక క్షేత్రస్థాయి పరిశీలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement