
మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తిగా సుష్మిత
కోస్గిరూరల్: కోస్గి మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తిగా సుష్మిత సోమవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో నాంపల్లి మెట్రోపాలిటీ కోర్టులో పనిచేయగా బదిలీపై కోస్గికి వచ్చారు. ఇక్కడ పని చేసిన న్యాయమూర్తి ఫర్హిన్బేగం హయత్నగర్ కోర్టుకు బదిలీ అయ్యారు. కోస్గి బార్ ఆసోసియేషన్ అధ్యక్షుడు గందె ఓం ప్రకాష్ ఆధ్వర్యంలో పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. కార్యక్రమంలో బార్అసోసియేషన్ సభ్యులు ప్రభాకర్, వీఎన్గౌడ్, శకనప్ప, మురళీనామాజీ, రాములు, రాజలింగం, భీమేష్, మల్లిఖార్జున్, రాములు తదితరులు పాల్గొన్నారు.