మొదటిరోజే పుస్తకాలు అందించాలి | - | Sakshi
Sakshi News home page

మొదటిరోజే పుస్తకాలు అందించాలి

Jun 10 2025 3:18 AM | Updated on Jun 10 2025 3:18 AM

మొదటిరోజే పుస్తకాలు అందించాలి

మొదటిరోజే పుస్తకాలు అందించాలి

నారాయణపేట: విద్యాశాఖ, డీఆర్‌డీఏ, పంచాయతీ రాజ్‌ శాఖల పరిధిలో కొనసాగుతున్న ప్రగతి పనులపై సోమవారం తన ఛాంబర్‌లో సమీక్ష జరిపారు. విద్యాశాఖకు సంబంధించి పాఠశాలల పునః ప్రారంభం రోజు వరకు అన్ని పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు సరఫరా చేయాలని కలెక్టర్‌ సూచించారు. జిల్లాలో బడిబాట కార్యక్రమంలో ఎంత మంది పిల్లలు నమోదు అయ్యారని కలెక్టర్‌ ప్రశ్నించగా ఇప్పటి వరకు 349 మంది నమోదు అయ్యారని, వారిలో వివిధ ప్రైవేట్‌ పాఠశాలల నుంచి 37 మంది నమోదు అయ్యారని డీఈఓ గోవిందరాజులు వివరించారు. మండలాల వారీగా పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు ఎంత సరఫరా చేశారో నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ ఆదేశించారు. జిల్లా మహిళా సమాఖ్య భవన నిర్మాణ పనులను మరింత వేగంగా చేయించాలని నిర్ణీత గడువు నవంబర్‌లోపు ప్రారంభానికి సిద్దం చేయాలని పీఆర్‌ఈఈ హీర్యానాయక్‌కు ఆమె సూచించారు. సోలార్‌ పవర్‌ పాయింట్‌ల కోసం గుర్తించిన ప్రభుత్వ భూముల వివరాలను డీఆర్‌డీఏ మొగులప్పను అడిగి తెలసుకున్న కలెక్టర్‌ వెంటనే ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో యూడిఐటి (సదరం) స్లాట్ల పెండింగ్‌ పై కలెక్టర్‌ అసహనం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు పెండింగ్‌ను క్లియర్‌ చేసేందుకు అస్పత్రి సూపరింటెండెంట్‌తో సమన్వయం చేసుకోవాలని డీఆర్‌డీఏను ఆదేశించారు. సమావేశంలో అడిషనల్‌ కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌ పాల్గొన్నారు.

భూసేకరణ పునరావాసంపై సమీక్ష

నారాయణపేట, కొడంగల్‌ ఎత్తిపోతల పథకానికి సంబంధించి రెవెన్యూ అధికారులు ఇటీవలే నిర్వహించిన గ్రామ సభలు, భూ సేకరణ సర్వేపై వచ్చిన నోటిఫికెషన్లపై కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ సమీక్షించారు. ఈమేరకు అడిషనల్‌ కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌ మాట్లాడుతూ భూ సేకరణలో పునరావాసం, పునరుపాధి అనేది భూసేకరణ ప్రాజెక్టుల ద్వారా నిర్వాసితులైన వ్యక్తులు, కుటుంబాలకు మద్దతు అందించే ప్రక్రియను సూచిస్తుందన్నారు. ఇందులో న్యామైన పరిహారాన్ని నిర్ధారించడం వారి పునరావాసం కోసం తగిన సౌకర్యాలను అందించడం, తరచుగా సేకరణ తర్వాత వారి సామాజిక, ఆర్థిక స్థితిని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకోవడం వంటివి ఉంటాయన్నారు. భూ సేకరణ చేసినప్పుడు పట్టాదారులు తమ భూములు కోల్పోతే ప్రభుత్వ పరంగా నష్టపరిహారం చెల్లించడం జరుగుతుందన్నారు. కానీ భూ సేకరణలో భూమితో పాటు జీవనోపాధిని కోల్పోయిన వారికి ఆర్‌అండ్‌ అర్‌ చట్టం వర్తిస్తుందని తెలిపారు. వచ్చిన 13 నోటిఫికేషన్లలో 12 మందికి ఆర్‌అండ్‌అర్‌ చట్టం వర్తిస్తుందని పునరావాస పునరుపాధి కమిటీ సభ్యులకు తెలిపారు. సమావేశంలో ఆర్డీఓ రాంచంద్రనాయక్‌, సెక్షన్‌ అధికారి శ్రీధర్‌, సభ్యులు సతీశ్‌కుమార్‌ గౌడ్‌, పగడాకుల శ్రీనివాసులు, నారాయణపేట, మక్తల ఊట్కూర్‌ తహశీల్దార్లు పాల్గొన్నారు.

‘బడిబాట’లో బడి బయటి విద్యార్థులను గుర్తించాలి

కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement