తల్లి చదువుతోకుటంబాల్లో వెలుగులు | - | Sakshi
Sakshi News home page

తల్లి చదువుతోకుటంబాల్లో వెలుగులు

Jun 5 2025 7:42 AM | Updated on Jun 5 2025 7:42 AM

తల్లి చదువుతోకుటంబాల్లో వెలుగులు

తల్లి చదువుతోకుటంబాల్లో వెలుగులు

తల్లి చదవడం ద్వారా ఆ కుటుంబంలో వెలుగు నిండుతుంది. చదువు విలువ తెలిసి కుటుంబమంతా అక్షరాస్యులు ఉంటే ఆ కుటుంబాల ద్వారా గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ది పథంలో పయనించేందుకు దోహదపడుతుంది. బడికి వెళ్లే పిల్లల సంఖ్య పెరగడంతోపాటు డ్రాపౌట్‌ తగ్గితే బాల్య వివాహాలపై అవగాహన పెరుగుతుంది. అక్షరాస్యులుగా మారడం ద్వారా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలపై అవగాహన పెరిగి ప్రభుత్వ పథకాలు అర్హులైన వారందరికి అందుతాయి.

మహిళలకు మంచి అవకాశం

నిరక్షరాస్యులైన మహిళలకు చదువడం, రాయడం నేర్పించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న ఉల్లాస్‌ పథకం చదువు రాని వారికి మంచి అవకాశం. జిల్లాలో ఉన్న మహిళా సంఘాల్లో నిరక్షరాస్యుల వివరాలు వయోజన విద్యాశాఖ అధికారులకు అందజేశాం. ఉల్లాస్‌ పథకంలో భాగంగా మహిళా సంఘాల్లో నిరక్షరాస్యులతోపాటు బడి మధ్యలో మానిన వారికి, దివ్యాంగులకు సైతం చదవడం, రాయడం నేర్పిస్తారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ నూతన పథకాన్ని నిరక్షరాస్యులైన మహిళలందరు సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ లక్ష్యాన్ని నేరవేర్చాలి.

– మొగులప్ప,

డీఆర్డీఓ, నారాయణపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement