జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి | - | Sakshi
Sakshi News home page

జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి

Jun 3 2025 5:43 AM | Updated on Jun 3 2025 5:43 AM

జిల్ల

జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి

నారాయణపేట: రాష్ట్రాన్ని ప్రపంచ వేదికపై ఆవిష్కరించడంలో విజయం సాధించామని.. అమెరికా, దక్షిణకోరియా, సింగపూర్‌, దావోస్‌, జపాన్‌ దేశాల లో పర్యటించి భారీగా పెట్టుబడులు సాధించడం జరిగిందని.. ఇక జిల్లా విషయానికి వస్తే ప్రజాపాలనలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని, జిల్లా సర్వతోముఖాభివృద్ధికి మనమంతా కంకణ బద్దులు కావాలని రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఆర్‌.గురునాథ్‌రెడ్డి అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, ఎస్పీయోగేష్‌ గౌతమ్‌, అడిషనల్‌ కలెక్టర్‌ సంచిత్‌గంగ్వార్‌, గ్రంథాలయ సంస్థల జిల్లా చైర్మన్‌ వార్ల విజయ్‌కుమార్‌తో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ముందుగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గురున్నాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనూ, ప్రపంచస్థాయిలోనూ అగ్రస్థానంలో నిలిపేందుకు సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైసింగ్‌ 2047 విజన్‌తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ఇందులో నాలుగు కీలక అంశాలు ఉన్నాయని అవి పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, ప్రపంచ స్థాయి ఇన్ఫ్రా డెవలప్‌మెంట్‌, పారదర్శక సుపరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టిందని, తెలంగాణ సమగ్ర అభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్‌ అండ్‌ సోషల్‌ జస్టిస్‌ పాలసీ, గ్రీన్‌ ఎనర్జీ పాలసీ, ఇన్ఫ్రా అండ్‌ ఇండస్ట్రీయల్‌ పాలసీ, టూరిజం పాలసీలను ప్రభుత్వం సిద్ధం చేసిందని చెప్పారు.

విద్యకు పెద్దపీట

జిల్లా కేంద్రంలో, కోస్గిలో ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలలు ప్రారంభించారని, మిషన్‌ భగీరథ ఇంట్రగ్రిడ్‌ ద్వారా వేసవి కాలంలో నీటి ఎద్దడి నివారణకు జిల్లాకు రూ.92.91 లక్షలు మంజూరు చేశారన్నారు. ప్రజాపాలన, మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి 3,566 కొత్త రేషన్‌కార్డులను మంజూరు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో శాంతి భద్రతల కల్పనలో భాగంగా పోలీస్‌ శాఖ నుంచి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి రూ.2.79 కోట్లతో ధన్వాడ పీఎస్‌ను, 2.79 కోట్లతో పేట రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ను సీఎం చేతుల మీదుగా ఇదివరకే ప్రారంభించడం జరిగిందన్నారు. ఎస్పీ కార్యాలయం భవన నిర్మాణానికి 7 ఎకరాల ల్యాండ్‌ , 38.50 కోట్ల రూపాయల బడ్జెట్‌ మంజూరు అయ్యిందని వివరించారు.

రైతులకు రుణ విముక్తి

దేశ చరిత్రలో నిలిచిపోయేలా అధికారంలోకి వచ్చిన కేవలం 8 నెలల్లోనే రూ.25,35,964 మంది రైతులకు రూ.20,617 కోట్లు రుణ మాఫీ చేయడం జరిగిందన్నారు. రైతు భరోసా కింద ఎకరానికి రూ. 12 వేలు అందిస్తున్నామని, రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తున్నామన్నారు. గతేడాది రూ.2.90 కోట్ల టన్నుల ధాన్యం పండించి తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు. నిరుపేదలకు సన్న బియ్యం పంపిణీ చేయడం జరిగిందన్నారు. యువతే ప్రజా ప్రభుత్వ నిజమైన నిర్మాతలని, వారి భవిష్యతుకు గ్యారంటీ ఇస్తూ యువత ఉపాధి ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని మొదటి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామన్నారు. నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ చైర్మన్‌ శివారెడ్డి, ఆర్డీఓ రాంచందర్‌నాయక్‌, కలెక్టరేట్‌ ఏఓ జయసుధ, పీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

జాతీయ జెండాకు వందనం చేస్తున్న రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఆర్‌.గురునాథ్‌రెడ్డి, కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, ఎస్పీయోగేష్‌ గౌతమ్‌, ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి

లక్ష ఎకరాలకుసాగునీరు..

నారాయణపేట – కొడంగల్‌ – ఎత్తిపోతల పథకంతో లక్ష ఎకరాలకు సాగు నీరు అందించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది వానాకాలం 4.35 లక్షల ఎకరాల్లో సాగు అయ్యే వివిధ పంటల కోసం అవసరమయ్యే విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచడం జరిగిందని, 1.4 కోట్ల సబ్సీడి విలువగల జీలుగ జనుము విత్తనాలు రైతులకు పంపిణీ చేయబోతుందన్నా రు. ఈజీఎస్‌ ద్వారా జిల్లాలో 1,10,727 జాబ్‌కార్డులు ఉండగా రూ.1294.13 లక్షల ఖర్చు అయ్యి ందన్నారు. ఆసరా కింద 75,449 మంది లబ్ధిదారులకు ప్రతి నెల రూ. 18.86 కోట్లు చెల్లించడం జరిగిందన్నారు. బ్యాంకు లింకేజీ రూ.263.43 కోట్లు మహిళ సంఘాలకు చెల్లింపులు, నాలుగు ఇంది రా మహిళ శక్తి క్యాంటీన్లు, మిల్క్‌ పార్లర్‌ పాడి గేదేల పెంపకం, పైడి కోళ్ల పెంపకం తదితర వాటిని ప్రారంభించడం జరిగిందన్నారు.

తెలంగాణ రైజింగ్‌–2047విజన్‌తో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు..

మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం

రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఆర్‌.గురునాథ్‌రెడ్డి

కలెక్టరేట్‌లో అట్టహాసంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి 1
1/1

జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement