భూ సేకరణపై కలెక్టర్‌ సమీక్ష | - | Sakshi
Sakshi News home page

భూ సేకరణపై కలెక్టర్‌ సమీక్ష

Jun 3 2025 5:43 AM | Updated on Jun 3 2025 5:43 AM

భూ సేకరణపై కలెక్టర్‌ సమీక్ష

భూ సేకరణపై కలెక్టర్‌ సమీక్ష

నారాయణపేట: జిల్లా కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో సోమవారం భూ సేకరణ, పునరావాసంపై కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. నారాయణపేట, కొడంగల్‌ ఎత్తిపోతల పథకానికి సంబంధించి రెవెన్యూ అధికారులు ఇటీవలే నిర్వహించిన గ్రామసభలు, భూసేకరణ సర్వేపై ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో కలెక్టర్‌ ఆధ్వర్యంలో పునరావాస కమిటీ ఏకగ్రీవంగా ఆమోదం తెలపడంతో కమిటీ ఆమోదించిన నివేదికను ఆర్‌అండ్‌ఆర్‌ కమిషనర్‌ హైదరాబాద్‌కు ప్రతిపాదనలు పంపించడం జరుగుతుందని కలెక్టర్‌ తెలిపారు. సమావేశంలో అడిషనల్‌ కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌, ఆర్డీఓ రాంచంద్రనాయక్‌, సెక్షన్‌ అధికారి శ్రీధర్‌, సభ్యులు రవికుమార్‌, సతీశ్‌కుమార్‌, కోళ్ల కిష్టమ్మ, శివ, నారాయణపేట, మక్తల్‌, ఊట్కూర్‌, దామరగిద్ద తహసీల్దార్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement