వరికి రూ.3 వేలు ఇవ్వాలి.. | - | Sakshi
Sakshi News home page

వరికి రూ.3 వేలు ఇవ్వాలి..

Jun 4 2025 12:25 AM | Updated on Jun 4 2025 12:25 AM

వరికి

వరికి రూ.3 వేలు ఇవ్వాలి..

పెట్టుబడులు ఏటా పెరుగుతున్నందున వరి క్వింటాకు రూ.3 వేలు ప్రకటించాలి. కేంద్రం కేవలం రూ.69 పెంచడం ఎంతో నిరా శగా ఉంది. ఎకరా వరి సాగుకు ప్రస్తుతం రూ. 40 వేలు ఖర్చవుతోంది. మరోమారు పునరాలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది.

– శ్రీనివాసులు, రైతు, ఎలిగండ్ల

పత్తి ధర పెంపు మంచిదే..

త్తికి మద్దతు ధర పెంచడంతో ఈసారి అధిక శాతం మంది రైతులు పంట సాగు చేయాలనే ఆలోచన వచ్చింది. గతేడాది కలుపు తీసేందుకు నాగళ్లకు రూ.2 వేలు ఉన్న అద్దె ఈసారి ఏకంగా రూ.3 వేలకు పెంచడమే కాకుండా కూలీలు, విత్తనాలు, ఎరువుల ధరలు పెరగడంతో ఆశించిన స్థాయిలో లాభాలు వచ్చేలా కనిపించడం లేదు. ధర పెంచడం కొద్దిమేరకు మంచిదే. – రవి, పత్తి రైతు, మరికల్‌

ఆదేశాలు రావాలి..

కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరల పెంపుపై ఆదేశాలు వస్తే ఈ వర్షాకాలం పంటల నుంచి అమలవుతోంది. ప్రస్తుత వానాకాలంలో జిల్లాలో 1.80 లక్షల ఎకరాల్లో పత్తి సాగుకానున్నట్లు అంచనా వేశాం. ధర పెరగడంతో మరింత పెరిగే అవకాశం ఉంది. అలాగే కంది సాగుపై కూడా రైతులు దృష్టి సారిస్తున్నారు.

– జాన్‌ సుధాకర్‌, జిల్లా వ్యవసాయ అధికారి

వరికి రూ.3 వేలు ఇవ్వాలి.. 
1
1/1

వరికి రూ.3 వేలు ఇవ్వాలి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement