డిప్యూటీ సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి | - | Sakshi
Sakshi News home page

డిప్యూటీ సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి

Jun 6 2025 12:22 AM | Updated on Jun 6 2025 12:22 AM

డిప్య

డిప్యూటీ సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి

జడ్చర్ల/అడ్డాకుల/నవాబుపేట: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం దేవరకద్ర నియోజకవర్గంలోని మూసాపేట, జడ్చర్ల నియోజకవర్గంలోని నవాబుపేటలో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మూసాపేటలో ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి, కలెక్టర్‌ విజయేందిర, నవాబుపేటలో అడిషనల్‌ కలెక్టర్‌ శివేంద్రప్రతాప్‌ సభ ఏర్పాట్లను పరిశీలించారు. జడ్చర్ల నియోజకవర్గానికి సంబంధించి రూ.108 కోట్ల వ్యయంతో కొత్తగా 33/11కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్లు 16, నవాబుపేటలో కొత్తగా 132/33 కేవీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్లకు శుక్రవారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేయనున్నారని ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి తెలిపారు. కాగా.. దేవరకద్ర నియోజకవర్గంలోని మూసాపేట మండలంలో 132/33 కేవీ సబ్‌స్టేషన్‌తో పాటు మరో ఎనిమిది సబ్‌స్టేషన్లకు కూడా డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేయనున్నారు. మూసాపేట సభలో మైనార్టీ కార్పోరేషన్‌ ద్వారా మంజూరైన కుట్టు మిషన్లను లబ్ధిదారులకు అందజేయడంతో పాటు రైతులకు మంజురైన విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లను పంపిణీ చేస్తారని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి తెలిపారు.

ఉప ముఖ్యమంత్రి పర్యటన ఇలా:

శుక్రవారం ఉదయం 11 గంటలకు హెలికాప్టర్‌లో మూసాపేటకు రానున్నారు. 12 గంటల వరకు అక్కడే పలు సబ్‌స్టేషన్లకు సంబంధించి శంకుస్థాపన చేయడంతో పాటు అధికారులు, నాయకులను కలుస్తారు. 12 నుంచి ఒంటి గంట వరకు బహిరంగసభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు మూసాపేట నుంచి నవాబుపేటకు బయల్దేరుతారు. అక్కడ 17 సబ్‌స్టేషన్లకు శంకుస్థాపనలు చేయడంతో పాటు అధికారులతో సమావేశం అవుతారు. సాయంత్రం 4.15 నుంచి 5 గంటలకు నవాబుపేటలో బహిరంగసభలో పాల్గొంటారు

● డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క సభ ఏర్పాట్లను అడిషనల్‌ కలెక్టర్‌ శివేంద్రప్రతాప్‌ పరిశీలించారు. నవాబుపేట సమీపంలోని రైస్‌మిల్లు ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగసభకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఆర్‌డీఓ వెంకట్‌రెడ్డి, మార్కెట్‌ చైర్మన్‌ లింగం, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఎంపీడీఓ జయరాంనాయక్‌, తదితరులు ఉన్నారు.

జడ్చర్ల పరిధిలో 16, దేవరకద్ర పరిధిలో8 సబ్‌స్టేషన్లకు శంకుస్థాపన

మరో రెండు 132/33 కేవీ సబ్‌స్టేషన్లకు శ్రీకారం

నేడు మూసాపేట, నవాబుపేటలో మల్లు భట్టి విక్రమార్క పర్యటన

డిప్యూటీ సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి 1
1/1

డిప్యూటీ సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement