ఉత్సాహంగా బాస్కెట్‌బాల్‌ క్రీడాకారుల ఎంపికలు | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా బాస్కెట్‌బాల్‌ క్రీడాకారుల ఎంపికలు

Jun 2 2025 12:42 AM | Updated on Jun 2 2025 12:42 AM

ఉత్సాహంగా బాస్కెట్‌బాల్‌ క్రీడాకారుల ఎంపికలు

ఉత్సాహంగా బాస్కెట్‌బాల్‌ క్రీడాకారుల ఎంపికలు

మహబూబ్‌నగర్‌ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్‌ స్టేడియంలో ఆదివారం ఉమ్మడి జిల్లా 3X3 పురుషులు, మహిళా బాస్కెట్‌బాల్‌ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు మక్సూద్‌ బిన్‌ అహ్మద్‌, జాకీర్‌ క్రీడాకారులను పరిచయం చేసుకొని మాట్లాడుతూ బుధ, గురువారాల్లో జిల్లాకేంద్రంలోని ఇండోర్‌, అవుట్‌డోర్‌ స్టేడియంలో మొదటి రాష్ట్రస్థాయి 3X3 బాస్కెట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టోర్నీ లో ఆయా జిల్లాల నుంచి 150 మంది క్రీడాకారులు, 50 మంది అఫీషియల్స్‌ హాజరవుతారని తెలిపారు. ఉమ్మడి జిల్లా జట్లకు ఎంపికై న క్రీడాకారులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో సభ్యులు మీర్‌ ఖాలెద్‌అలీ, మహ్మద్‌ ఇలియాజ్‌, సుబాన్‌జీ, గోపాలకృష్ణ, ఫారూఖ్‌ ముకర్రం, మహ్మద్‌ షకీల్‌, వినోద్‌కుమార్‌, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement