‘స్థానిక’ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

‘స్థానిక’ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం

May 30 2025 12:38 AM | Updated on May 30 2025 12:38 AM

‘స్థానిక’ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం

‘స్థానిక’ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం

దేవరకద్ర: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని ఎంపీ డీకే అరుణ అన్నారు. గురువారం దేవరకద్రలోని మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్‌ డోకూర్‌ పవన్‌కుమార్‌రెడ్డి నివాసంలో మున్సిపాలిటీల నూతన కమిటీలతో నిర్వహించిన సమావేశంలో ఎంపీ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అమలుచేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అనునిత్యం ప్రజల మధ్యే ఉంటూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసి రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించాలని సూచించారు. సమావేశంలో నియోజకవర్గ ఇన్‌చార్జి కొండా ప్రశాంత్‌రెడ్డి, నాయకులు యజ్ఞ భూపాల్‌రెడ్డి, మాధవరెడ్డి, నారాయణరెడ్డి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement