
సర్వీస్ వివరాలు ఆన్లైన్లో నమోదు
నారాయణపేట రూరల్: జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బంది తమ సర్వీస్ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయించుకోవాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ సూచించారు. గురువారం ఆయన జిల్లాకేంద్రంలోని డీపీఓ కార్యాలయాన్ని తనిఖీ చేసి అధికారులు, సిబ్బంది సర్వీస్ సమాచార నమోదును ప్రత్యక్షంగా పరిశీలించారు. నమోదులో తలెత్తే ఇబ్బందులు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. సెలవులు, ట్రాన్స్ఫర్స్, శిక్షలు, రివార్డ్స్, ఇంక్రిమెంట్స్, వేతనాలు, అటాచ్మెంట్లు, పదోన్నతులు తదితర వివరాల నమోదు ఇక నుంచి హెచ్ఆర్ఎంఎస్లోనే జరగాలని సూచించారు. ఇకనుంచి కాగితంపై రాసిస్తే సెలవులు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు. అనంతరం మధ్యాహ్నం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి జిల్లా పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి ఉద్యోగి సాంకేతికతపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఎండీ రియాజ్ హుల్హక్, సీఐలు, ఎస్ఐలు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
టీజేఎఫ్ రజతోత్సవ
వాల్పోస్టర్ ఆవిష్కరణ..
నారాయణపేట: ఈ నెల 31న జరిగే టీజేఎఫ్ రజతోత్సవ ఆవిర్భావ సభ వాల్పోస్టర్ను గురువారం ఎస్పీ యోగేష్ గౌతమ్ గురువారం ఆవిష్కరించారు. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఏర్పాటై 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జాతీయ కార్యవర్గ సభ్యులు వారధి నవీన్కుమార్, రాష్ట్ర కార్యవర్గసభ్యుడు అనంతరాములు, జిల్లా అధ్యక్షుడు ఆనంద్కుమార్గౌడ్, ప్రధానకార్యదర్శి పృథ్విరాజ్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు ఆవుటి రాజశేఖర్, సభ్యులు బాల్రాజు, శ్రీధర్, రాము, వెంకట్రాములు, కృష్ణ, శ్రీనివాస్, మధు, హర్షద్, రహీం, సోఫీ, నవాజ్, అజహర్ తదితరులు పాల్గొన్నారు.