
శిక్షణ శిబిరాల్లో ప్రతిభ చాటాలి
మహబూబ్నగర్ క్రీడలు: వేసవి క్రీడా శిక్షణ శిబిరాల్లో విద్యార్థులు ప్రతిభను చాటాలని ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు ఎన్పీ వెంకటేశ్ అన్నారు. జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో వచ్చేనెల 6వ తేదీ వరకు నిర్వహించనున్న వేసవి శిబిరాలను గురువారం జిల్లాకేంద్రంలోని మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారుల్లో వివిధ క్రీడాంశాల్లో శిక్షణ అందజేసి వారిని జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేలా తీర్చిదిద్దాలని కోరారు. డీవైఎస్ఓ ఎస్.శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ఏడాది జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 10, అర్బన్ ప్రాంతాల్లో 21 చోట్ల వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్, ఉపాధ్యక్షుడు మక్సూద్ బిన్ అహ్మద్ జాకీర్, జగన్మోహన్గౌడ్ పాల్గొన్నారు.