కాళికాదేవి హుండీ ఆదాయం రూ.12.56 లక్షలు | - | Sakshi
Sakshi News home page

కాళికాదేవి హుండీ ఆదాయం రూ.12.56 లక్షలు

Apr 17 2025 12:50 AM | Updated on Apr 17 2025 12:50 AM

కాళిక

కాళికాదేవి హుండీ ఆదాయం రూ.12.56 లక్షలు

కొత్తపల్లి: దక్షిణ భారతేశంలోనే అతి పెద్ద గిరిజన పుణ్యక్షేత్రం గురులోకా మసంద్‌ బావాజీ బ్రహ్మోత్సవాలు ముగిసిన సందర్భంగా ఆలయ సముదాయంలోని కాళికాదేవి మాత హుండీని బుధవారం లెక్కించారు. మొత్తం రూ.12.56 లక్షలు ఆదాయం వచ్చింది. ఎండోమెంట్‌, ఎస్‌బీఐ అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో లెక్కింపు నిర్వహించారు. బావాజీ ఆలయంలో మొత్తం మూడు హుండీలు ఉండగా బుధవారం కేవలం కాళికాదేవి హుండీ ఆదాయాన్ని లెక్కించినట్లు ఆలయ ఈఓ కోమాల్‌ తెలిపారు. బావాజీ, హనుమాన్‌ ఆలయాల్లోని హుండీలను లెక్కించాల్సి ఉందన్నారు. మద్దూరు పోలీసుల బందోబస్తు నిర్వహించారు.

పెసర క్వింటాల్‌ రూ.7,579

నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్‌ యార్డులో బుధవారం పెసర క్వింటాల్‌కు గరిష్టంగా రూ.7,579, కనిష్టంగా రూ.6,509 ధర పలికింది. అలాగే, జొన్నలు గరిష్టంగా రూ.3,951, కనిష్టంగా రూ.2,831, అలసందలు గరిష్టంగా రూ.6,241, కనిష్టంగా రూ. 6,231, వడ్లు సోనా గరిష్టంగా 2,209, కనిష్టంగా రూ.1,603, ఎర్ర కందులు గరిష్టంగా రూ. 7,032, కనిష్టంగా రూ.6,722, తెల్ల కందులు గరిష్ట, కనిష్టంగా రూ.7,011 ధరలు పలికాయి.

హజ్‌కు వెళ్లే వారికి

వైద్య పరీక్షలు నిర్వహించాలి

నారాయణపేట: నారాయణపేట హజ్‌ సొసైటీకి చెందిన ప్రతినిధి బృందం జిల్లా జనరల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామ్‌ కిషన్‌ను బుధవారం కలిసి హజ్‌యాత్రకు వెళ్లే వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఫిట్‌నెస్‌ సర్టి ఫికెట్‌ ఇవ్వాలని కోరింది. ఇందుకు స్పందించిన ఆయన గురువారం ఉదయం 9 గంటలకు హజ్‌ యాత్రికులు నారాయణపేట, మక్తల్‌, కోస్గీ హాస్పిటల్‌లను సంప్రదించి వైద్య పరీక్షలు పూర్తిచేసుకోవాలని తెలిపారు. హజ్‌ యాత్రికులు సమయపాలనతో సంబంధిత ఆసుపత్రుల వద్ద హాజరు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సూపరింటెండెంట్‌ను కలిసిన వారిలో హజ్‌సోసైటి బృందం ప్రతినిధులు అమీరుద్దీన్‌, అబ్దుస్‌ సలీం, సర్ఫరాజ్‌ హుస్సేన్‌ అన్సారీ, అజీమ్‌ మడ్కి, మహమ్మద్‌ అజహర్‌లు ఉన్నారు.

పనులు సకాలంలోపూర్తి చేయాలి

పాలమూరు: మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ పరిధిలో పెండింగ్‌లో ఉన్న రైల్వే పనులు, ఆర్‌ఓబీ, ఆర్‌యూబీ నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయాలని ఎంపీ డీకే అరుణ అన్నారు. బుధవారం మహబూబ్‌నగర్‌ క్యాంప్‌ కార్యాలయంలో రైల్వే అధికారులతో పెండింగ్‌ పనులపై ఎంపీ సమీక్షించారు. మహబూబ్‌నగర్‌లోని మోతీనగర్‌, న్యూగంజ్‌, టీడీగుట్ట, వీరన్నపేట, పాలిటెక్నిక్‌ కళాశాల వరకు డబ్లింగ్‌ పనులు, భూసేకరణలో కలిగే ఇబ్బందులపై చర్చించారు. మహబూబ్‌నగర్‌, దేవరకద్రలో ఆర్‌ఓబీ, డబ్లింగ్‌ పనుల భూసేకరణ, తిమ్మసానిపల్లి, బొక్కలోనిపల్లి ప్రాంతాల్లో రైల్వేగేట్‌, ఆర్‌ఓబీ ఏర్పాటుపై సమీక్షించారు. మక్తల్‌ పరిధిలోని దేవరపల్లిలో రైల్వే ట్రాక్‌ పరిధిలోని తదితర సమస్యలపై అధికారులు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో అధికారులు సంజయ్‌కుమార్‌, డి.జగదీష్‌, ఎంఎంఎస్‌ రాజు, మహబూబ్‌నగర్‌ ఆర్డీఓ నవీన్‌, మున్సిపల్‌ కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డి, డిప్యూటీ ఈఈ దిలీప్‌కుమార్‌, ఏఈఈ రొక్కేందర్‌రెడ్డి, డీఈఈ జైపాల్‌రెడ్డి, ఏఈఈ శివానంద్‌, సర్వేయర్‌ రాఘవేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

కాళికాదేవి హుండీ ఆదాయం రూ.12.56 లక్షలు
1
1/2

కాళికాదేవి హుండీ ఆదాయం రూ.12.56 లక్షలు

కాళికాదేవి హుండీ ఆదాయం రూ.12.56 లక్షలు
2
2/2

కాళికాదేవి హుండీ ఆదాయం రూ.12.56 లక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement