మక్తల్: భూత్పూర్, సంగంబండ రిజర్వాయర్ల నుంచి రబీసీజన్లో ప్రతి ఎకరానికి సాగునీరు అందించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం సంగంబండ రిజర్వాయర్ నుంచి లెప్ట్హైలెవల్ కెనాల్ నుంచి నీటిని ఎమ్మెల్యే విడుదల చేశారు. నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించి ఈ ప్రాంతాన్ని సస్యశామలం చేస్తామని, కాల్వ నుంచి పారే చెరువులన్నింటికి నీటిని వదులుతామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ గణేష్కుమార్, మాజీ ఎంపీపీ చంద్రకాంత్గౌడ్, వెంకటేష్, రాయికోడ్ ఆనంద్, జయప్రకాస్రెడ్డి పాల్గొన్నారు.