
న్యాయపోరాటానికి సిద్ధం
అగ్రిమెంట్ కాలం ఉండగానే మమ్మల్ని తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అన్యాయం. మా వాహనాలకు సంబంధించి బ్యాంక్ ఆఫ్ బరోడాలో పెండింగ్లో ఉన్న బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించి ఎన్ఓసీ ఇప్పించాలి. మాకు న్యాయం చేయకుండా జూన్ 1 నుంచి రేషన్ షాపుల ద్వారా బియ్యం సరఫరా చేస్తే ప్రభుత్వంతో న్యాయ పోరాటానికి సిద్ధమవుతాం. – ఖాజా శ్రీనివాసులు, ఎండీయూ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నంద్యాల
ఉపాధి కోల్పోయాం
వచ్చే కొద్దిపాటి జీతంతో కుటుంబాన్ని పోషించుకునే వీలుండేది. గత నాలుగేళ్లుగా ఎండీయూ వాహనంపై ఆధారపడి జీవిస్తున్నాను. ఒక్కసారిగా ఎండీయూ వాహనాలను తొలగిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించడం అన్యాయం. ఉపాధి కోల్పోతున్న ఆపరేటర్లకు న్యాయం చేయకపోతే ఆందోళనలకు సిద్ధమవుతాం.
– రమణ, ఎండీయూ ఆపరేటర్, నంద్యాల

న్యాయపోరాటానికి సిద్ధం