జ్వాలాపురం సందర్శన | - | Sakshi
Sakshi News home page

జ్వాలాపురం సందర్శన

May 2 2025 1:24 AM | Updated on May 2 2025 1:24 AM

జ్వాల

జ్వాలాపురం సందర్శన

బనగానపల్లె రూరల్‌: ఆదిమానవులు నివసించిన ఆనవాళ్లు ఉన్న జ్వాలాపురం గ్రామాన్ని గురువారం అధికారులు సందర్శించారు. ఆదిమానవుల సంచారానికి సంబంధించిన కథనాలు ఇటీవల పత్రికల్లో ప్రచురితమవుతుండటంతో జిల్లా కలెక్టర్‌ రాజకుమారి స్పందించారు. ఈ మేరకు ఈ ప్రదేశాన్ని పరిశీలించేందుకు ఆర్డీఓ, డిప్యూటీ సీఈఓ, పురావస్తు, మైనింగ్‌శాఖ అధికారులు, తహసీల్దార్‌ మొత్తం ఏడుగురు అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. దీంతో ఈ ప్రదేశాన్ని గురువారం డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి శివారెడ్డి పరిశీలించారు. త్వరలో పురావస్తుశాఖ, ఆర్డీఓతో పాటు ఇతర అధికారులు జ్వాలాపురాన్ని పరిశీలించనున్నట్లు వారు తెలిపారు. వారి వెంట ఎంపీడీఓ వెంకటరమణ తదితరులు ఉన్నారు.

శ్రీమఠంలో భక్తజన

సందోహం

మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామి మఠం భక్తజన సందోహంతో కనువిందు చేసింది. గురువారం ప్రత్యేకం కావడంతో భక్తులు కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చారు. రాఘవేంద్రస్వామి బృందావన దర్శనానికి 3 గంటల సమయం పట్టింది. సాధారణ క్యూలైన్లు, వీవీఐపీ క్యూలైన్లు, మంచాలమ్మ దర్శన మార్గాలు భక్తలతో కిక్కిరిశాయి. అన్నపూర్ణ భోజనశాల, పరిమళ ప్రసాదం కౌంటర్లలో రద్దీ నెలకొంది. మధ్వమార్గం కారిడార్‌, తుంగభద్ర నది వైపు కారిడార్‌లు భక్తులతో పోటెత్తాయి.

కార్మిక చట్టాలపై అవగాహన

కర్నూలు కల్చరల్‌: మేడే సందర్భంగా కర్నూలులోని న్యాయ సేవా సదన్‌లో గురువారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్మిక చట్టాలపై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి, శాశ్వత లోక్‌ అదాలత్‌ చైర్మన్‌ వెంకట హరినాథ్‌ అవగాహన కల్పించారు. ఈ–శ్రమ్‌ కార్డును పొందాలని అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ సాంబశివరావు సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్లు శ్రీలక్ష్మీ, కేశన్న, ప్రసాద్‌, దుకాణ కార్మికులు, ఆటో, హమాలీ, బిల్డింగ్‌ కార్మికులు పాల్గొన్నారు.

క్యూఆర్‌ కోడ్‌తో వైద్యసేవలపై అభిప్రాయం

కర్నూలు(హాస్పిటల్‌): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అందే వైద్యసేవలపై క్యూఆర్‌ కోడ్‌తో రోగులు, వారి కుటుంబసభ్యులు అభిప్రాయాన్ని చెప్పవచ్చని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.వెంకటేశ్వర్లు సూచించారు. గురువారం ఆయన ఆసుపత్రిలోని పలు విభాగాలను తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఓపీ కౌంటర్‌, ఎంసీహెచ్‌, పీడియాట్రిక్‌, ఫిజియోథెరపి, శుశ్రుత భవన్‌ తదితర విభాగాల్లో పర్యటించి వైద్యసేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని పలు ఓపీ, ఐపీ విభాగాలకు వచ్చే రోగులకు అందుతున్న వైద్యసేవల అభిప్రాయా న్ని క్యూఆర్‌ కోడ్‌లో నమోదు చేసుకునే విధంగా రోగులకు అవగాహన ఇవ్వాలని వైద్యులు, నర్సింగ్‌ సిబ్బందికి సూచించారు. శుశ్రుత భవన్‌, సర్జికల్‌ విభాగంలోని ఆపరేషన్‌ థియేటర్‌లో పర్యటించి యూనిట్‌ వారీగా ఎన్నెన్ని సర్జరీలు చేస్తున్నారనే దానిపై ఆరా తీశారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగి తప్పనిసరిగా ఆధార్‌కార్డు, అభా కార్డు తీసుకుని వస్తే ఓపీ నమోదు ప్రక్రియ, ఇతర సేవలు వేగంగా అందుతాయని చెప్పారు. ఆయన వెంట డిప్యూటీ సూపరింటెండెంట్‌ శ్రీరాములు, అడ్మినిస్ట్రేటర్‌ సింధు సుబ్రహ్మణ్యం, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేటర్‌ శివబాల నాగాంజన్‌, డాక్టర్‌ కిరణ్‌కుమార్‌, డాక్టర్‌ సునీల్‌ ప్రశాంత్‌ తదితరులు ఉన్నారు.

జ్వాలాపురం సందర్శన 1
1/3

జ్వాలాపురం సందర్శన

జ్వాలాపురం సందర్శన 2
2/3

జ్వాలాపురం సందర్శన

జ్వాలాపురం సందర్శన 3
3/3

జ్వాలాపురం సందర్శన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement