
వృద్ధ ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం
నంద్యాల(వ్యవసాయం): వృద్ధ(70 ఏళ్లు వయస్సుపై బడిన) ఖైదీలకు, అనారోగ్యంతో బాధ పడే వారికి ఉచిత న్యాయ సహాయం అందిస్తామని ఉమ్మడి కర్నూలు జిల్లా న్యాయ సేవాది కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి తెలిపారు. త్వరగా బెయిల్ మంజూరు అయ్యేలా కృషి చేస్తామని చెప్పారు. నంద్యాల స్పెషల్ సబ్ జైలును బుధవారం ఆయన తనిఖీ చేశారు. జైలు ఖైదీలకు ప్రిజన్ లీగల్ ఎయిడ్ క్లినిక్స్ గురించి తెలియజేశారు. ప్రిజన్ లీగల్ ఎయిడ్లో ఒక అడ్వకేట్, ఒక పారా లీగల్ వలంటీర్ ఉంటారని, వారు ఖైదీలకు న్యాయ సహాయాలు అందిస్తారని తెలిపారు. ఖైదీలకు ఎవరికై నా న్యాయవాదులు లేకుంటే ఉచితంగా నియమిస్తామని అన్నారు. లీగల్ సర్వీసెస్ హెల్ప్లైన్ నంబర్ 15100పై ఖైదీలకు తెలియజేశారు . జైల్ సూపరింటెండెంట్ గురుప్రసాద్ రెడ్డి, జిల్లా జైళ్ల అధికారి నరసింహారెడ్డి, జైల్ డాక్టర్ గురుకుమార్, లాయర్ బాలు నాయక్, శేషసాయి పాల్గొన్నారు.