
పాలిసెట్కు సర్వం సిద్ధం
● 30న ప్రవేశ పరీక్ష
● జిల్లాకు 22 పరీక్ష కేంద్రాలు
కేటాయింపు
● హాజరుకానున్న 5,700 మంది
అభ్యర్థులు
నంద్యాల(న్యూటౌన్): పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 30న పాలిసెట్–2025 నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. పరీక్షకు గంట ముందుగానే ఆయా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతిస్తారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. జిల్లా వ్యాప్తంగా పాలిసెట్కు 5,700 మంది దరఖాస్తు చేసుకున్నారు. నంద్యాలలో 13 పరీక్ష కేంద్రాలు కేటాయించారు. ఇందులో 3,747 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు.
జిల్లాలో 5 కళాశాలలు
ప్రభుత్వ పాలిటెక్నిక్ పాటు జిల్లావ్యాప్తంగా 2 ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలున్నాయి. వీటిల్లో కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి. నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్లో సివిల్ 66, మెకానికల్ 132 సీట్లు ఉండగా, ఐదు ప్రైవేటు కళాశాలల్లో వివిధ కోర్సుల్లో సుమారు 1,500 సీట్లు ఉన్నాయి. ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న వారిలో ఎంత మంది హాజరవుతారో, వారిలో ర్యాంకులు సాధించేవారెందరో, ర్యాంకు వచ్చినా పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరేందుకు ఎంత మంది ఆసక్తి చూపుతారో చూడాల్సి ఉంది. కొన్నేళ్లుగా కొన్ని కళాశాలల్లో వందల సంఖ్యలో సీట్లు ఉండగా, పదుల సంఖ్యలోనే విద్యార్థులు చేరుతూండటంతో తరగతుల నిర్వహణ ఇబ్బందిగా మారుతున్నట్లు సమాచారం.
గంట ముందుగానే ప్రవేశం
● ప్రవేశ పరీక్ష ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తారు.
● పరీక్ష కేంద్రంలోకి ఉదయం 10 గంటల నుంచి అనుమతిస్తారు.
● పరీక్ష ప్రారంభమైన తర్వాత నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోనికి అనుమతించరు.
● విద్యార్థులు హాల్ టికెట్టు, బాల్ పాయింట్ పెన్ను, హెచ్బీ పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్ తీసుకుని వెళ్లాలి.
● సెల్ఫోన్, కాలిక్యులేటర్ తదితర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు.
మౌలిక వసతులకు ప్రాధాన్యం
పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేశాం. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. కేంద్రాల ఆవరణంలో తాగునీరు, విద్యుత్, వైద్య సేవల వంటి మౌలిక వసతులకు కల్పనకు ప్రాధాన్యమిచ్చాం.
– శ్రీనివాసప్రసాద్, జిల్లా కో ఆర్డినేటర్, నంద్యాల

పాలిసెట్కు సర్వం సిద్ధం