
మండువేసవిలో నిండుగా జలం
తిప్పర్తి : వేసవి వచ్చిందంటే చెరువులు, కుంటలు ఎండిపోయి కనిపిస్తాయి. కానీ తిప్పర్తి మండలంలోని గంగన్నపాలెం గ్రామంలో ఉన్న చెరువు మాత్రం మండుటెండలో నిండుకుండలా జలకళ సంతరించుకుంది. పానగల్ చెరువు నుంచి వచ్చే జాలు, చందనపల్లి వద్ద ఉన్న వాటర్ప్లాంట్నుంచి వేస్ట్ వాటర్ ఈ చెరువులోకి చేరుతుంది. ఈ చెరువులో నిత్యం నీరు ఉండడంతో గంగన్నపాలెం, కాశివారిగూడెం, నానాపురం, రాజుపేట గ్రామాల్లో భూగర్భ జలాలు పుష్కలంగా ఉంటాయి. ఈ వేసవిలో చెరువు నిండు కుండలా ఉండడంతో ముందస్తుగా పంటల సాగుకు అవకాశం ఉంటుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.