ఆస్పత్రి ఎదుట ఆందోళన | - | Sakshi
Sakshi News home page

ఆస్పత్రి ఎదుట ఆందోళన

Mar 28 2023 1:26 AM | Updated on Mar 28 2023 1:26 AM

మిర్యాలగూడ అర్భన్‌ : సరైన వైద్య సేవలు అందని కారణంగానే వ్యక్తి మృతిచెందాడని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు సోమవారం పట్టణంలోని ఓ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వివరాలు ఇలా ఉన్నాయి. దామరచర్ల మండలం రాళ్లవాగుతండాకు చెందిన ధీరావత్‌ మల్లు (43) గుండెకు సంబంధించిన సమస్యతో బాధపడుతుండడంతో కుటుంబ సభ్యులు ఆదివారం పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతున్న మల్లు సోమవారం మృతిచెందాడు. సరైన చికిత్స అందకపోవడంతోనే మల్లు మృతిచెందాడని కుటుంబ సభ్యులు కొంత సేపు ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. పెద్దల జోక్యంతో విరమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement