ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు కల్పించాలి. ముఖ్యంగా తరగతి గదులు, ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలి. సకాలంలో పాఠ్యపుస్తకాలు అందించాలి. ఈసారి యూనిఫాం అందించడంలో ఆలస్యం కావడం బాధాకరం.
– బాలపీరు, నాగర్కర్నూల్
ఏర్పాట్లు పూర్తి..
పాఠశాలల పునఃప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. ప్రభుత్వ బడుల్లో కొత్తగా చేరే విద్యార్థులకు ప్రత్యేకంగా స్వాగతం పలుకుతాం. ఇందుకు ఉపాధ్యాయులు అన్ని ఏర్పాట్లు చేశారు. విద్యార్థుల ఏకరూప దుస్తులకు సంబంధించిన వస్త్రం రెండు రోజుల క్రితం జిల్లాకు వచ్చింది. 15 రోజుల్లో కుట్టించి, విద్యార్థులకు పంపిణీ చేస్తాం. – రమేశ్కుమార్, డీఈఓ
●


