తాడూరు: విద్యార్థులు మనోధైర్యంతో ముందుకు సాగాలని జిల్లా లీగల్ సెల్ కార్యదర్శి నసీం సుల్తానా అన్నారు.మంగళవారం రాష్ట్ర హైకోర్టు ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యాన్ని ఏర్పర్చుకొని సాధించాలన్నారు. ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగాలన్నారు. పాఠశాలలో వంటగది, తరగతి, డార్మెటరీ గదులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థినులకు పుస్తకాలు అందజేశారు. అనంతరం మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అదేవిధంగా జానేశ్వర వాత్సల్య మందిరం సందర్శించారు.
ముగిసిన క్రీడా పాఠశాలలకు ఎంపికలు
కందనూలు: నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో మంగళవారం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలోని క్రీడా మైదానంలో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో 4వ తరగతి ప్రవేశం కొరకు జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహించారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి 65 మంది విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో ఎంపికై న విద్యార్థులను జూలై 4, 5వ తేదిల్లో హైదరాబాద్లోని హాకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్లో రాష్ట్ర ఎంపికలకు హాజరవుతారని జిల్లా యువజన, క్రీడల అధికారి సీతారాం తెలిపారు. కార్యక్రమంలో డీఈఓ రమేష్కుమార్, ఎంఈఓ భాస్కర్రెడ్డి తదితరులు ఉన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతాం
కల్వకుర్తి రూరల్: కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాల నరసింహ అన్నారు. మంగళవారం పట్టణంలోని యూటీఎఫ్ భవనంలో సీపీఐ జిల్లా మహాసభలకు సంబంధించి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 1, 2వ తేదీలలో జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు డాక్టర్ శ్రీనివాస్, ఆనంద్ జి, ఫయాజ్, వెంకటయ్య, కేశవులు గౌడ్, నరసింహ, చంద్రమౌళి, భరత్, పరశురాములు, ధారదాసు ఉన్నారు.

విద్యార్థులు మనోధైర్యంతో ముందుకు సాగాలి

కేంద్ర, రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతాం