
‘పది’ ఫలితాల్లో 5వ స్థానానికి చేరుకుంటాం
తిమ్మాజిపేట: ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతి ఫలితాల్లో నాగర్కర్నూల్ జిల్లాను రాష్ట్రంలో 12 నుంచి 5వ స్థానానికి చేర్చేందుకు ఉపాధ్యాయులు, విద్యార్థులు లక్ష్యంగా పెట్టుకోవాలని విద్యాశాఖ జిల్లా అధికారి రమేష్కుమార్ అన్నారు. మండలంలోని గొరిట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు నీటి సౌకర్యం కల్పించేందుకు గ్రామానికి చెందిన మొసలి శ్యామ్సుందర్రెడ్డి సొంత ఖర్చులతో చేపట్టిన పైప్లైన్ పనులను మంగళవారం డీఈఓ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ కష్టపడి చదివి పదో తరగతి పరీక్షల్లో మండల టాపర్లుగా నిలిచిన విద్యార్థులను హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ్డి, జిల్లా స్థాయిలో ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే రాజేష్రెడ్డి ఘనంగా సన్మానించారని గుర్తు చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లోనే అన్ని వసతులు
ప్రభుత్వ పాఠశాలల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు బోధన అందించడంతో పాటు విద్యార్థులకు క్రీడా మైదానం, ఉచిత నోట్, పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్నం భోజనం ఉంటుందన్నారు. త్వరలో విద్యార్థులకు కంప్యూటర్ బోధన చేస్తామన్నారు. ఈ ఏడాది నుంచి 8 నుంచి 10 తరగతులకు ఖాన్ అకాడమీ వారు ఉచితంగా ఆన్లైన్లో అన్ని సబ్జెక్టులపై అవగాహన కల్పిస్తారన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ సత్యనారాయణ, దాత శ్యామ్ప్రసాద్రెడ్డి, హెచ్ఎం గోవిందప్ప, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ వసీమాబేగం, నాయకులు అచ్యుతారెడ్డి, జానకీరాంరెడ్డి, నారాయణ, చిన్నయ్య, మన్నెంరెడ్డి, బాల్రెడ్డి, పెంటయ్య, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.