ఉమ్మడి జిల్లాలో మున్సిపల్‌ కమిషన్ల బదిలీ | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి జిల్లాలో మున్సిపల్‌ కమిషన్ల బదిలీ

Jun 25 2025 1:31 AM | Updated on Jun 25 2025 1:31 AM

ఉమ్మడి జిల్లాలో మున్సిపల్‌ కమిషన్ల బదిలీ

ఉమ్మడి జిల్లాలో మున్సిపల్‌ కమిషన్ల బదిలీ

నాగర్‌కర్నూల్‌/మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: రాష్ట్రవ్యాప్త బదిలీలలో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కొందరు మున్సిపల్‌ కమిషనర్లకు స్థానచలనం కలగగా, మరికొందరికి పదోన్నతి లభించింది. ఈ మేరకు మంగళవారం సీడీఎంఏ టీకే శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేవారు. ఇప్పటివరకు జవహర్‌నగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ (గ్రేడ్‌ –2)గా పనిచేస్తున్న టి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి మహబూబ్‌నగర్‌కు బదిలీపై వచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న డి.మహేశ్వర్‌రెడ్డికి ఇంకా ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వకుండా వెయిటింగ్‌లో ఉంచారు. వనపర్తి జిల్లాలోని అమరచింత కమిషనర్‌ (గ్రేడ్‌–1)గా పనిచేస్తున్న ఎం.రవిబాబును నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు డిప్యూటీ కమిషనర్‌గా బదిలీ అయింది. ఆయన స్థానంలో నల్లగొండ జిల్లా హుస్నాబాద్‌ మున్సిపాలిటీలో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న సీహెచ్‌.నాగరాజు పదోన్నతిపై వస్తున్నారు. నాగర్‌కర్నూల్‌లో కమిషనర్‌ (గ్రేడ్‌–2) గా పనిచేస్తున్న బి.నరేష్‌బాబును మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కొత్త మున్సిపాలిటీ అయిన దేవరకద్రకు పంపిస్తున్నారు. అక్కడికి మేడ్చల్‌ నుంచి నాగిరెడ్డి (గ్రేడ్‌–2) కమిషనర్‌గా వెళ్తున్నారు. అలంపూర్‌లో ఇన్‌చార్జ్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న పి.చంద్రశేఖర్‌ పదోన్నతిపై కొల్లాపూర్‌కు బదిలీ అయ్యారు. అక్కడ పనిచేస్తున్న టి.శ్రీనివాసన్‌కు ఇంకా ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వలేదు. అలంపూర్‌కు ఎవరినీ నియమించలేదు. మక్తల్‌లో ఇన్‌చార్జ్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న ఎన్‌.శంకర్‌నాయక్‌ను అక్కడే రెగ్యులర్‌ అధికారిగా పదోన్నతి కల్పించారు. నాగర్‌కర్నూల్‌ మున్సిపాలిటీలో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న డి.మురళిని కమిషనర్‌గా (గ్రేడ్‌–3) పదోన్నతిపై అచ్చంపేటకు పంపిస్తున్నారు. ఇక్కడ ఇంతవరకు ఇన్‌చార్జ్‌ కమిషనర్‌గా పనిచేసిన జి.యాదయ్య కోస్గికి మేనేజర్‌గా వెనక్కి వెళ్తున్నారు. మేడ్చల్‌లో రెవెన్యూ ఆఫీసర్‌ (ఆర్‌ఓ)గా పనిచేస్తున్న ఖాజా ఆరీఫొద్దీన్‌ను పదోన్నతిపై వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీ కమిషనర్‌ (గ్రేడ్‌–3)గా బదిలీ చేశారు. అక్కడ పనిచేస్తున్న ఎస్‌.అశోక్‌రెడ్డికి ఇంకా ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వలేదు. ఇక మహబూబ్‌నగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఏఎంసీగా పనిచేస్తున్న జె.పవన్‌కుమార్‌ను కమిషనర్‌ (గ్రేడ్‌–2)గా పదోన్నతిపై ముడుచింతలపల్లికి పంపిస్తున్నారు. ఇక్కడికి ఏఎంసీగా ఎ.రాజన్న పదోన్నతిపై వస్తున్నారు. అలాగే పాలమూరులో శానిటరీ ఇన్‌స్పెక్టర్లుగా పనిచేస్తున్న యు.గురులింగం పదోన్నతిపై ఆందోల్‌–జోగిపేట మున్సిపల్‌ కమిషనర్‌ (గ్రేడ్‌–3) గా, డి.వాణికుమారి జీహెచ్‌ఎంసీలో అసిస్టెంట్‌ ఎస్టేట్‌ ఆఫీసర్‌గా, కె.రవీందర్‌రెడ్డిని నల్లగొండ మున్సిపాలిటీ ఏఎంసీ కమిషనర్‌ (గ్రేడ్‌–3) గా పంపించారు.

నలుగురు ఎస్‌ఐలకు గ్రేడ్‌–3 కమిషనర్లుగా పదోన్నతి

వెయిటింగ్‌ లిస్ట్‌లో మహేశ్వర్‌రెడ్డి, శ్రీనివాసన్‌, అశోక్‌రెడ్డి

నాగర్‌కర్నూల్‌ మున్సిపల్‌ కమిషనర్‌గా నాగిరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement