ఎస్‌ఏ–2 పరీక్షలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ఏ–2 పరీక్షలు ప్రారంభం

Apr 10 2025 12:46 AM | Updated on Apr 10 2025 12:46 AM

ఎస్‌ఏ–2 పరీక్షలు ప్రారంభం

ఎస్‌ఏ–2 పరీక్షలు ప్రారంభం

కందనూలు/వెల్దండ: జిల్లాలో 1నుంచి 9 తరగతుల విద్యార్థులకు సమ్మెటీవ్‌ అసెస్‌మెంట్‌–2 పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. వెల్దండ మండలం పెద్దాపూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, తుంకిబండ తండా ప్రాథమిక పాఠశాలలను డీఈఓ రమేష్‌ కుమార్‌ ఆకస్మికంగా సందర్శించి.. పరీక్షల నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా ప్రభు త్వ, ప్రైవేటు, గురుకులాలు తదితర 1,100 పాఠశాలల్లో 1 నుంచి 9వ తరగతి వరకు సుమారు లక్ష మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు తెలి పారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు గాలి, వెలుతురు పుష్కలంగా ఉండేలా చూడాలని హెచ్‌ఎంలకు సూచించారు. ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగే పరీక్షలను సమర్థవంతగా నిర్వహించాలని తెలిపారు. పరీక్షల అనంతరం జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి ఈ నెల 23న ఫలితాలు వెల్లడించాలని.. విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటుచేసి ప్రోగ్రెస్‌ కార్డులను అందించాలని డీఈఓ సూచించారు. డీఈఓ వెంట జిల్లా టెస్ట్‌ బుక్‌ మేనేజర్‌ నర్సింహులు, ఇన్‌చార్జి ఎంఈఓ చంద్రుడు నాయక్‌ ఉన్నారు.

సజావుగా ‘పది’ మూల్యాంకనం

కందనూలు: జిల్లా కేంద్రంలో పదో తరగతి వార్షి క పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం సజా వుగా కొనసాగుతుందని డీఈఓ రమేష్‌ కుమార్‌ తెలిపారు. స్థానిక లిటిల్‌ ఫ్లవర్‌ ఉన్నత పాఠశాలలో బుధవారం రెగ్యులర్‌ విద్యార్థుల పరీక్ష పేపర్లు తెలుగు 6,761, హిందీ 6,089, ఆంగ్లం 4,144, గణితం 7,175, ఫిజికల్‌ సైన్స్‌ 8,331, బయోసైన్స్‌ 5,098, సోషల్‌ స్టడీస్‌ 5,908తో కలిపి మొత్తం 43,898 పేపర్లను మూల్యాంకనం చేసినట్లు డీఈఓ వెల్లడించారు. మూల్యాంకనం కేంద్రంలో ఉపాధ్యాయులకు పలు సూచనలు చేయడంతో పాటు ప్రథమ చికిత్స మందులను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో ఎగ్జామ్స్‌ ఏసీ రాజశేఖరరావు, అసిస్టెంట్‌ క్యాంపు ఆఫీసర్‌ కురుమయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement