
డ్రగ్స్ నియంత్రణకు కృషి చేయాలి
ఏటూరునాగారం: డ్రగ్స్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ అన్నారు. ఏఎస్పీ కార్యాలయంలో డ్రగ్స్ నియంత్రణపై పోస్టర్లను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాసంస్థలకు 100 గజాల పరిధిలో సిగరెట్, గుట్కా, తంబాకు వంటి పొగాకు ఉత్పత్తులను విక్రయించకూడదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ములుగును డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చే దిశగా యువతను, ప్రజలను మమేకం చేస్తూ మత్తు, మాదక ద్రవ్యాలపై విస్తృత అవగాహన సదస్సులు నిర్వహించ నున్నట్లు తెలిపారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఏఎస్పీ శివం ఉపాధ్యాయ