
‘తల్లి పేరుతో మొక్క నాటండి’
ములుగు రూరల్: డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దినోత్సవాన్ని పరస్కరించుకుని జిల్లా కేంద్రంలో బీజేపీ మహిళా మోర్చా నాయకులు మొక్కలు పంపిణీ చేశారు. ఈ మేరకు మంగళవారం మహిళా మోర్చా ఆధ్వర్యంలో తల్లి పేరుతో మొక్కను నాటండి కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు బలరాం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. శ్యాం ప్రసాద్ ముఖర్జీ దేశం కోసం చేసిన త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతిఒక్కరూ మొక్కలు నాటి కాపాడాలన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా నాయకులు మాధవి, రమ, జయ, సుభద్ర, తిరుమల, బీజేపీ నాయకులు రాజ్కుమార్, కుమార్, రవిరెడ్డి, శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు.