ములుగు మున్సిపాలిటీ కమిషనర్‌గా సంపత్‌ | - | Sakshi
Sakshi News home page

ములుగు మున్సిపాలిటీ కమిషనర్‌గా సంపత్‌

Jun 25 2025 1:31 AM | Updated on Jun 25 2025 1:35 AM

ములుగు రూరల్‌: ములుగు మున్సిపాలిటీ కమిషనర్‌గా జె.సంపత్‌ మంగళ వారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఆయనను నియమిస్తూ ప్రభుత్వ కార్యదర్శి టీకె.శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్‌ మున్సిపల్‌ కమిషన్‌ కార్యాలయంలో సానిటరీ ఇన్‌ స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సంపత్‌ను పదోన్నతిపై ములుగు మున్సిపాలిటీ కమిషనర్‌ గ్రేడ్‌ –3 ఆఫీసర్‌గా బదిలీ చేశారు. ఈ మేరకు ఆయన బాధ్యతలు స్వీకరించారు.

రైతుల ఖాతాల్లో రూ.96.63 కోట్లు జమ

ములుగు రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతు భరోసా నిధులను ఇటీవల విడుదల చేసింది. ఈ మేరకు జిల్లాలోని 78,347 మంది రైతులకు గాను రూ.96.63 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయని కలెక్టర్‌ దివాకర మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు భరోసా నిధులను పంటలకు అవసరమ య్యే విత్తనాలు, ఎరువులు, ఇతర సాగు అవసరాలకు వినియోగించుకోవాలని సూచించారు.

చిరు జల్లులకే

చిత్తడైన రహదారి

వాజేడు: మండల పరిధిలోని జగన్నాథపురం గ్రామంలో చిరు జల్లులకే ప్రధాన రహదారి చి త్తడిగా మారింది. వాజేడు నుంచి భద్రాచలం వెళ్లడానికి ఇది ప్రధాన రహదారి. ప్రతిరోజూ ఎక్కువ సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటా యి. జగన్నాథపురం ఊరు మధ్యలో రహదారి గుంతలు పడి వర్షం నీరు నిలిచింది. నీరు బయటకు వెళ్లడానికి అవకాశం లేకపోవడంతో రహదారిపై నీరు నిలిచిందని గ్రామస్తులు తెలిపారు. భారీ వర్షాలు పడితే రహదారిపై ఇంకా గుంతలు పడే ప్రమాదం ఉందని వెంటనే మరమ్మతులు చేపట్టి వర్షం నీరు నిల్వకుండా చూడాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.

తీర్థయాత్రలకు రైల్వే సేవలు వినియోగించుకోవాలి

ములుగు రూరల్‌ : తీర్థయాత్రలకు వెళ్లే భక్తులు ప్రత్యేక రైళ్లను వినియోగించుకోవాలని ఐఆర్‌టీసీ టూరిజం జాయింట్‌ జనరల్‌ మేనేజర్‌ డీఎస్‌జీపీ కిశోర్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 05 నుంచి జూలై 13వ తేదీ వరకు హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక రైళ్లను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఉజ్జయిని (మహకాళేశ్వర్‌–ఓంకారేశ్వర్‌), త్రయంబకేశ్వర్‌–భీమశంకర్‌, ఘృష్ణేశ్వర్‌ జ్యోతిర్లింగ యాత్రలో ఎల్లోరా, మోవ్‌, నాగ్పూర్‌ ప్రాంతాలను సందర్శించొచ్చని వివరించారు. సాధారణ టికెట్‌ ధర రూ. 14,700, 3–ఏసీ రూ.22,900, 2–ఏసీ రూ. 29,900 ఉంటుందని తెలిపారు. ఈ యాత్ర రైలు సికింద్రాబాద్‌, కామారెడ్డి, నిజామాబాద్‌, ధర్మాబాద్‌, నాందేడ్‌, ముద్ఖడ్‌, పూర్ణ మీదుగా వెళ్తుందని తెలిపారు. టికెట్‌ బుక్‌ చేసుకునే వారు సెల్‌ 9701360701, 9281495843,9281030750, 9281030749 నంబర్‌లలో సంప్రదించాలని సూచించారు.

కేటీకే 1వ గనిలో

సమస్యలు పరిష్కరించాలి

భూపాలపల్లి అర్బన్‌: భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 1వ గనిలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ) బ్రాంచ్‌ కార్యదర్శి మోటపలుకుల రమేష్‌ డిమాండ్‌ చేశారు. కేటీకే 1వ గనిలో ఫిట్‌ సెక్రటరీ సదయ్య ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన గేట్‌ మీటింగ్‌కు రమేష్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మాన్‌రైడింగ్‌ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని, కార్మికుల కాప్‌లైట్స్‌, ఎక్స్‌ప్లోడర్స్‌, ఫిల్టర్‌ బెడ్‌ రిపేర్‌, తాగునీటి సమస్యలు తక్షణమే పరిష్కరించాలని కోరారు. బైక్‌ పార్కింగ్‌ షెడ్స్‌లలో సిమెంట్‌ రేకులు తొలగించి ఐరన్‌ రేకులు ఏర్పాటు చేయాలన్నారు. 3సీమ్‌లో ఖాళీ టబ్బులు సరిపడా పెంచాలని, మాన్‌వేలో వర్షం వల్ల స్లాపు పగుళ్లు ఏర్పడి కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే రిపేర్‌ చేయాలని కోరారు. కేటీకే ఓసీ 2 నుంచి కేటీకే 1వ గని వరకు వీధి దీపాలు ఏర్పాటుచేయాలని కోరారు. ఈ సమస్యలపై గని మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సదయ్య, సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

ములుగు మున్సిపాలిటీ కమిషనర్‌గా సంపత్‌
1
1/2

ములుగు మున్సిపాలిటీ కమిషనర్‌గా సంపత్‌

ములుగు మున్సిపాలిటీ కమిషనర్‌గా సంపత్‌
2
2/2

ములుగు మున్సిపాలిటీ కమిషనర్‌గా సంపత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement