
గాజర్ల కుటుంబానికి నకిరేకల్ ఎమ్మెల్యే పరామర్శ
టేకుమట్ల: మండలంలోని వెలిశాల గ్రామానికి చెందిన మావోయిస్టు నేత గాజర్ల రవి అలియాస్ గణేష్ ఇటీవల ఎన్కౌంటర్లో మృతి చెందగా మంగళవారం ఆయన కుటుంబ సభ్యులను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పరామర్శించారు. ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళ్లర్పించారు. ఆయన కుటుంబానికి ప్రగాడ సానుభూతిని తెలిపారు. మాతృశ్రీ ఫౌండేషన్ చైర్మన్ దొంతుల శ్రీనివాస్, ఏవైఎస్, దళిత సంఘాల నాయకులు కూడా పరామర్శించారు. పరామర్శించిన వారిలో అరకొండ రాజయ్య, తిరుమలేష్, ఎలకటి రాజయ్య, సాంబయ్య, రాములు, కిరణ్, కుమార్, రమేష్, భద్రయ్య, ప్రకాశ్, క్రాంతి ఉన్నారు.