రైతులతో సీఎం ముఖాముఖి | - | Sakshi
Sakshi News home page

రైతులతో సీఎం ముఖాముఖి

Jun 25 2025 1:35 AM | Updated on Jun 25 2025 1:35 AM

రైతులతో సీఎం ముఖాముఖి

రైతులతో సీఎం ముఖాముఖి

గోవిందరావుపేట: మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ దివాకర ఆధ్వర్యంలో రైతులతో సీఎం రేవంత్‌రెడ్డి ముఖాముఖి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ప్రవేశ పెట్టిన రైతు భరోసా పథకం కింద కేవలం 9 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాలలో జమ చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని మంగళవారం రైతు భరోసా సంబురాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గోవిందరావుపేట మండల రైతులతో సీఎం రేవంత్‌ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సురేష్‌కుమార్‌, మండల ప్రత్యేక అధికారి, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement