
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాధేశ్యామ్’ కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్తో పాటు సినీ అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ మూవీ.. ఎట్టకేలకు మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. విడుదల తేది దగ్గరపడుతుడడంతో మూవీ ప్రమోషన్స్లో స్పీడ్ పెంచారు మేకర్స్. ఇదివరకు మరే సినిమాకు చేయనంతగా కాస్త కొత్తగా, డిఫరెంట్గా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ వరుస ఇంటరవ్యూలతో సినిమాని ఫుల్ ప్రమోట్ చేస్తున్నాడు.
ఇక ఈ సినిమాకి మరింత హైప్ తేవడం కోసం ప్రభాస్ అభిమానుల కోసం మార్చ్ 8న రాధే శ్యామ్ సినిమాకు సంబంధించిన ఎన్ఎఫ్టీ(NFT) లాంఛింగ్ జరగనుంది. ఈ కలెక్షన్లో ప్రభాస్ డిజిటల్ ఆటోగ్రాఫ్, 3డి యానిమేటెడ్ డిజిటల్ ఆర్ట్తో పాటు ఎక్స్క్లూజివ్ 3డి యానిమేటెడ్ పిక్చర్స్ కూడా ఉండబోతున్నాయి. సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ నడిపిన కారుకు సంబంధించిన 3డి యానిమేటెడ్ NFT కూడా ఇందులో ఉండబోతున్నాయి. వాటిని కొనుక్కోడానికి అభిమానులకు మార్చ్ 8 నుంచి అందుబాటులోకి రానున్నాయి.
డిజిటల్ కలెక్షన్లో విజేతగా నిలిచిన 100 మంది లక్కీ విన్నర్స్ నేరుగా ప్రభాస్ను కలిసే అవకాశం కూడా అందుకోనున్నారు. అంటే ఈ NFTలు ఎవరు ఎక్కువగా కొనుగోలు చేస్తే వాళ్లకు తమకు ఇష్టమైన స్టార్ను కలిసే అవకాశం మరింత ఎక్కువగా ఉండబోతుంది. అభిమానులు డబ్బుల రూపంలోనే వీటిని కొనుగోలు చేయొచ్చు. క్రిప్టో కరెన్సీతో దీనికి పని లేదు. ఈ సినిమాలో ప్రభాస్ తన కెరీర్లోనే మొదటిసారి జ్యోతిష్కుడిగా నటించారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ అందించారు.
Own a part of #RadheShyamNFTs in just 1 Minute & 100 lucky winners will get a chance to meet our superstar #Prabhas.
— UV Creations (@UV_Creations) March 7, 2022
REGISTER NOW on https://t.co/dQQsVGKsyL
👉🏼 Log In
👉🏼 Set Up Wallet
Get Ready for First DROP on 𝟖𝐭𝐡 𝐌𝐚𝐫𝐜𝐡, 𝟓 𝐏𝐌!#RadheShyam @ngageNFT @UV_Creations pic.twitter.com/4b611aB5TG