సీఈఐఆర్‌ పోర్టల్‌తో మేలు | - | Sakshi
Sakshi News home page

సీఈఐఆర్‌ పోర్టల్‌తో మేలు

May 27 2025 7:34 AM | Updated on May 27 2025 7:34 AM

సీఈఐఆర్‌ పోర్టల్‌తో మేలు

సీఈఐఆర్‌ పోర్టల్‌తో మేలు

మెదక్‌ మున్సిపాలిటీ: పట్టణ పరిధిలో 35 మొబైల్స్‌ రికవరీ చేసి బాధితులకు అప్పగించినట్లు ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో బాధితులకు మొబైల్స్‌ అందజేసి మాట్లాడారు. ప్రస్తుత రోజుల్లో మొబైల్‌ ఫోన్‌ ప్రతి ఒక్కరికీ నిత్యావసరంగా మా రిందన్నారు. ఎవరైనా ఫోన్‌ పోగొట్టుకుంటే, లేదా గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన సీఈఐఆర్‌ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. దీంతో పోగొట్టుకున్న ఫోన్‌ను నేరుగా బ్లాక్‌ చేయవచ్చని, ఒక వేల పోగొట్టుకున్న వ్యక్తులకు కంప్యూటర్‌ పరిజ్ఞానం లేకపోతే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలన్నారు. అంతకు ముందు జిల్లాస్థాయి ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి వివిధ సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుదారులకు చట్టపరంగా న్యాయం జరిగేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్‌, పట్టణ సీఐ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement