బేస్‌మెంట్‌ పూర్తికాగానే డబ్బులు | - | Sakshi
Sakshi News home page

బేస్‌మెంట్‌ పూర్తికాగానే డబ్బులు

May 25 2025 10:49 AM | Updated on May 25 2025 10:49 AM

బేస్‌మెంట్‌ పూర్తికాగానే డబ్బులు

బేస్‌మెంట్‌ పూర్తికాగానే డబ్బులు

కౌడిపల్లి(నర్సాపూర్‌)/కొల్చారం: ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయిన లబ్ధిదారులకు బేస్‌మెంట్‌ పూర్తి అయిన వెంటనే మొదటి బిల్లు అందజేస్తున్నామని జిల్లా హౌసింగ్‌ పీడీ మాణిక్యం తెలిపారు. శనివారం కౌడిపల్లిలో మోడల్‌ ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు 120 ఇళ్లకు మొదటి విడత రూ. 1 లక్ష చొప్పున లబ్ధిదారుల ఖాతాలో జమచేసినట్లు చెప్పారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 400 నుంచి 600 ఫీట్లలోపు ఇల్లును నిర్మించుకోవాలని సూచించారు. కాగా ఎక్కువ విస్తీర్ణంలో బేస్‌మెంట్‌ నిర్మించిన వారికి సైతం ప్రభుత్వం మరో అవకాశం కల్పించిందన్నారు. బేస్‌మెంట్‌ పరిధి ఎక్కువగా ఉన్న గోడలు 600 ఫీట్లలోపు నిర్మించే విధంగా అంగీకార పత్రం రాసిస్తే మొదటి విడత బిల్లు మంజూరు చేస్తామని వివరించారు. ఆయన వెంట సీనియర్‌ అసిస్టెంట్‌ బలరాం ఉన్నారు. అనంతరం కొల్చారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్‌ హౌస్‌ నిర్మాణ పనులను పరిశీలించారు.

జిల్లా హౌసింగ్‌ పీడీ మాణిక్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement