ఉపాధిపై సామాజిక తనిఖీ | - | Sakshi
Sakshi News home page

ఉపాధిపై సామాజిక తనిఖీ

May 21 2025 8:39 AM | Updated on May 21 2025 8:39 AM

ఉపాధిపై సామాజిక తనిఖీ

ఉపాధిపై సామాజిక తనిఖీ

చిన్నశంకరంపేట(మెదక్‌): మండలంలోని తొమ్మిది గ్రామ పంచాయతీల పరిధిలోని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులపై నార్సింగి మండల పరిషత్‌ కార్యాలయంలో సామాజిక తనిఖీ నిర్వహించారు. మంగళవారం నార్సింగి ఎంపీడీఓ ఆనంద్‌ అధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్‌రావు, డీవీఓ శ్రీహరిగౌడ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సామాజిక తనిఖీ బృందం సభ్యులు గ్రామాల వారీగా పనుల వివరాలతో పాటు అవకతవకలు వివరించారు. బీమ్‌రావుపల్లిలో సీనియర్‌ మెట్‌ నిబంధనలకు విరుద్ధంగా కుటుంబ సభ్యుల పేరుతో పనిచేసినట్లు మస్టర్‌లో రాశారని, జప్తిశివనూర్‌లో ఆదివారం కూడా పనిదినాలు కల్పించినట్లు రికార్డు చేసినట్లు వివరించారు. వల్లూర్‌లో పనిచేసిన వారికి డబ్బులు చెల్లించలేదని, నార్సింగిలో ఏడు రోజులు పనిచేసిన 162 మందికి డబ్బులు చెల్లించకపోవడంతో ఉపాధి కూలీలు నష్టపోయారని పేర్కొన్నారు. ఈ సందర్బంగా డీఆర్‌డీఏ పీడీ మాట్లాడుతూ సిబ్బంది నుంచి రూ.21,911 రికవరి పెట్టామని, రూ.20 వేలు జరిమానా విధించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి దామోదర్‌రెడ్డి, ఈజీఎస్‌ ఏపీఓ రాజేశ్వర్‌, సామాజిక తనిఖీ బృందం ఎస్‌ఆర్‌పీ తిరుపతి,హెచ్‌ఆర్‌ రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రూ.21,911 రికవరి,

రూ.20 వేల జరిమానా

డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్‌రావు వెల్లడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement