
ఏఐపై విద్యార్థులకు ఇంటర్న్షిప్
మెదక్జోన్: మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో 10 రోజుల పాటు నిర్వహించిన ఇంటర్న్షిప్ విజయవంతంగా కొనసాగినట్లు కళాశాల ప్రిన్సిపాల్ హుస్సేన్ తెలిపారు. శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న విద్యార్థులకు బుధవారం కళాశాలలో సర్టిఫికెట్లు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సహకారంతో డిగ్రీ తృతీయ సంవత్సరం విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్, కృత్రిమ మేధ అనువర్తనాలపై 10 రోజుల ఇంటర్న్షిప్ను విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు. అలాగే కళాశాలలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను ప్రారంభించారు. తగిన అవకాశాలు లభిస్తే విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించగలరని పేర్కొన్నారు. ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో హెచ్ఆర్ ప్రతినిధులు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో అధ్యాపకులు ప్రవీణ్ కుమార్, సురేందర్రావు, కాశీ విశ్వనాథ్, డాక్టర్ కిరణ్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.
మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల
ప్రిన్సిపాల్ హుస్సేన్