
రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు
తూప్రాన్: డివిజన్ పరిధిలో 5,557 మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన వారిలో 2,801 మంది రైతుల ఖాతాలో రూ. 25.32 కోట్లను ప్రభుత్వం జమ చేసిందని ఆర్డీఓ జయచంద్రారెడ్డి తెలిపారు. మండలంలోని ఆయా కొనుగోలు కేంద్రాలను బుధవారం సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చేగుంట మండలంలో 1,214 మంది రైతులకు రూ. 10.64 కోట్లు, వెల్దుర్తిలో 685 మంది రైతులకు రూ. 6.44 కోట్లు, నార్సింగిలో 609 మంది రైతులకు రూ. 5.53 కోట్లు, మాసాయిపేట మండలంలో 226 మంది రైతులకు రూ. 1.80 కోట్లు, తూప్రాన్ మండలంలో 58 మంది రైతులకు రూ. 57 లక్షలు, మనోహరాబాద్ మండలంలో 29 మంది రైతులకు రూ. 33 లక్షలు జమ చేసినట్లు వివరించారు. మిగిలిన రైతుల ఖాతాల్లో త్వరగా డబ్బులు జమ అవుతాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.
ఆర్డీఓ జయచంద్రారెడ్డి