
సీహెచ్సీలో ప్రసవానికి నిరాకరణ
● వైద్య అధికారుల నిర్లక్ష్యం ● గాంధీకి తరలించాలంటూఉచిత సలహా
తూప్రాన్: ప్రసవం చేయడం తమవల్ల కాదని వైద్యులు చేతులెత్తేశారు. పైగా గర్భిణిని గాంధీకి తీసుకెళ్లాలని సలహా ఇచ్చారు. అంబులెన్స్లో తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే ఆమె ప్రసవించింది. తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని పోతరాజుపల్లికి చెందిన కృప రెండవ కాన్పు కోసం పట్టణంలోని సీహెచ్సీకి భర్త క్రాంతి కుమార్ శుక్రవారం తీసుకొచ్చారు. వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించి కాన్పు కావడం కష్టం అవుతుందన్నారు. ఆస్పత్రిలో వైద్యులు, పరికరాలు లేవని తేల్చి చెప్పారు. వెంటనే గాంధీకి తీసుకెళ్లాలని సూచించారు. అసలే పేదవారు కావడంతో గాంధీకి వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. తీరా 108లో తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలో పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో ఈఎంటీ శ్రీనివాస్ అంబులెన్స్లోనే కాన్పు చేశాడు. పండంటి మగ బిడ్డకు కృప జన్మనించింది. అనంతరం గాంధీ ఆస్పత్రిలో చేర్చగా తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. కాగా ప్రభుత్వ ఆస్పత్రిలో పేదలకు నాణ్యమైన వైద్యం అందుతుందని వస్తే వైద్యులు లేరని తిప్పి పంపడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.